యాప్నగరం

కరోనా ఆస్పత్రుల పరిసరాల్లో గాలిలో వైరస్: సీసీఎంబీ

Coronavirus Spread: కరోనా హాస్పిటళ్లలో గాలిలో వైరస్ ఉంటుందని సీసీఎంబీ తెలిపింది. తాజా అధ్యయనానికి సంబంధించిన నివేదిక విడుదల చేసింది.

Samayam Telugu 6 Jan 2021, 10:13 am
కొవిడ్ హాస్పిటల్ పరిసరాలలోని గాలిలో కరోనా వైరస్ ఉండే అవకాశం ఉందని సీసీఎంబీ (Centre for Cellular and Molecular Biology) వెల్లడించింది. అలాంటి చోట్లకు వెళితే వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్‌లో ఉన్న ఈ ప్రతిష్టాత్మక జాతీయ సంస్థ దీనిపై గత 3 నెలలుగా అధ్యయనం చేస్తోంది. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను మంగళవారం (జనవరి 5) వెల్లడించింది. కరోనా ఆస్పత్రుల ఆవరణలోనూ వైరస్ ఉంటుందని తెలిపింది. కొవిడ్ రోగుల సంఖ్య, వారు ఉండే సమయం ఆధారంగా గాలిలో వైరస్ ప్రభావం ఉంటుందని వెల్లడించింది.
Samayam Telugu వైరస్
Coronavirus spread


అధ్యయనంలో భాగంగా.. కరోనా సోకిన రోగులను ఓ క్లోజ్‌డ్ రూమ్‌లో కొంతసేపు ఉంచి.. వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత నమూనాలు సేకరించి పరీక్షించారు. ఈ పరిశోధనలో పాజిటివ్‌గా తేలిందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్ట్ర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఐసీఎంఆర్ (ICMR)తో కలిసి CCMB ఈ అధ్యయనం చేసింది.

మూసిఉన్న గదుల్లో (లోపలి గాలి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉండే ఏసీ గదులు, ఐసీయూలు) కొన్ని గంటల తర్వాత కూడా కరోనా వైరస్ యాక్టివ్‌గా ఉంటుందని అధ్యయనంలో తేలింది. అంతేకాదు, ఇలాంటి గదుల్లో రెండు మీటర్ల కంటే ఎక్కువ దూరం వరకు కూడా వైరస్ వ్యాపిస్తుందని నిర్ధారణ అయింది.

సివిల్స్‌లో సత్తా చాటిన స్పీకర్ కూతురు.. తొలి ప్రయత్నంలోనే!
హైదరాబాద్‌తో పాటు మొహాలీలోని హాస్పిటల్‌లోనూ అధ్యయనం చేసినట్లు సీసీఎంబీ తెలిపింది. కరోనా వైరస్‌పై సీసీఎంబీ కొంత కాలంగా వివిధ రకాల అధ్యయనాలు చేస్తోంది. కరోనా రోగులు ఉన్న చోట గాలిలో వైరస్ ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

వైరస్ సోకకుండా ఇలా రక్షణ చర్యలు..
గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే వార్తల నేపథ్యంలో కొవిడ్ ఆస్పత్రుల్లో ఆది నుంచే పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్ వార్డులలోకి సాధారణ ప్రజలను అనుమతించడంలేదు. పేషెంట్లతో పాటు ఉన్న అటెండర్లను కూడా వార్డుల వద్దకు అనుమతించట్లేదు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐసీయూల్లో హెపా ఫిల్టర్లను వాడుతున్నారు. ఇవి ఆ గదుల నుంచి వైరస్‌ బయటకు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తాయి.

Also Read:

బర్డ్ ఫ్లూ భయం.. 3 రాష్ట్రాల్లో వైరస్

మన వ్యాక్సిన్ ఎవరికీ తీసిపోదు: భారత్ బయోటెక్

15 ఏళ్ల కిందట రైల్లో పోయిన బంగారు లాకెట్‌.. న్యూ ఇయర్‌లో ఇలా!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.