యాప్నగరం

చైనా, పాక్‌లతో యుద్ధానికి ఎయిర్‌ఫోర్స్ సిద్ధం

​ చైనాను సమర్థవంతంగా ఎదుర్కోగలమని, ఏక కాలంలో డ్రాగన్, పాక్‌లతో యుద్ధం చేయడానికి తాము సిద్ధమని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోహ తెలిపారు.

TNN 5 Oct 2017, 2:58 pm
చైనాను సమర్థవంతంగా ఎదుర్కోగలమని, ఏక కాలంలో డ్రాగన్, పాక్‌లతో యుద్ధం చేయడానికి తాము సిద్ధమని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోహ తెలిపారు. ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ఛాలెంజ్‌నైనా ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. సర్జికల్ స్ట్రయిక్స్‌లో వైమానిక దళం పాల్గొనాలనే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. సరిహద్దుల వెంబడి లక్ష్యాలను గుర్తించగల, వాటిని తాకగల సామర్థ్యం భారత వైమానిక దళానికి ఉందని ధనోహ తెలిపారు.
Samayam Telugu air force can wage two front war capable of countering china iaf chief
చైనా, పాక్‌లతో యుద్ధానికి ఎయిర్‌ఫోర్స్ సిద్ధం


చైనా, పాకిస్థాన్‌లతో ఏక కాలంలో యుద్ధం చేయాల్సి వచ్చిన మేం సిద్ధమేనని ఎయిర్ చీఫ్ మార్షల్ వెల్లడించారు. గత నెలలో ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. చైనా, పాక్‌లతో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండటం, చైనా బలగాలు ఇప్పటికీ టిబెట్‌లోని చుంబీ లోయలోనే ఉన్న నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ చీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.