యాప్నగరం

నో ఏసీ: నరకం చూపించిన ఎయిరిండియా

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాపై ఫిర్యాదులు కొత్తేమీ కాదు. ఎయిరిండియా విమాన సర్వీసులపై ప్రయాణికులు ఎప్పుడూ ఏదో ఒక ఫిర్యాదు చేస్తూనే ఉంటారు.

TNN 3 Jul 2017, 12:12 pm
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాపై ఫిర్యాదులు కొత్తేమీ కాదు. ఎయిరిండియా విమాన సర్వీసులపై ప్రయాణికులు ఎప్పుడూ ఏదో ఒక ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. విమానాల ఆలస్యం, ప్రయాణికులపై సిబ్బంది దురుసు ప్రవర్తన ఇలా చెప్పకుంటూ చాలా సార్లు ఎయిరిండియా వార్తల్లో నిలిచింది. తాజాగా మరోసారి ఎయిరిండియా డొల్లతనం బయటపడింది. విమానంలో ఏసీలు పనిచేయకపోయినప్పటికీ విమానాన్ని టేకాఫ్ తీసుకుని ప్రయాణికులకు ప్రత్యక్షం నరకం చూపించారు పైలెట్లు.
Samayam Telugu air india flight takes off with faulty acs leaves flyers gasping for oxygen
నో ఏసీ: నరకం చూపించిన ఎయిరిండియా


ప్రయాణికులు ఎన్ని సార్లు సిబ్బందికి ఫిర్యాదు చేసినా.. ఇదో పనిచేస్తుంది.. అదిగో పనిచేస్తుంది అంటూ గమ్యస్థానానికి తీసుకొచ్చేశారు. ఏసీలు పనిచేయకపోవడంతో తీవ్ర ఉక్కపోతతో ప్రయాణికులు ఉక్కిబిక్కిరయ్యారు. మొత్తం 168 మంది ప్రయాణికుల ప్రాణాలతో ఎయిరిండియా సిబ్బంది చెలగాటమాడారు. పశ్చిమ బెంగాల్‌లోని బగ్దోగ్రా నుంచి ఢిల్లీకి వెళ్లిన ఎయిరిండియా విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఎయిరిండియాకు చెందిన ఎయిర్‌బస్‌ 320 (ఎఐ-880) విమానం ఆదివారం మధ్యాహ్నం1.55 గంటలకు బగ్దోగ్రా నుంచి ఢిల్లీ బయల్దేరింది. విమానం టేకాఫ్‌ తీసుకుని 20 నిమిషాలయినా అందులోని ఏసీలు పనిచేయలేదు. దీంతో ప్రయాణికులు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. కొంతమంది అయితే ఆక్సిజన్ మాస్క్‌లు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఏసీల్లో సాంకేతిక సమస్య ఏర్పడిందని.. త్వరలోనే పరిష్కరిస్తామని సిబ్బంది తెలిపారు. కానీ ఏసీలు, ఆక్సిజన్ మాస్క్‌లు ఎంతకీ పనిచేయలేదు. దీంతో విమానంలో ఉక్కపోత మొదలైంది.

ఉక్కపోతను తట్టుకోలేక ప్రయాణికులు పేపర్లతో విసురుకున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకి విమానం ఢిల్లీ చేరుకుంది. విమానం కెప్టెన్‌, క్యాబిన్ సిబ్బంది తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎయిరిండియా విచారణకు ఆదేశించింది. మరోవైపు విమానంలో ప్రయాణికుల ఇబ్బందిని కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.