యాప్నగరం

భారత్ చేరిన ఎయిరిండియా వన్.. వీవీఐపీల పర్యటనకు వినియోగించే దీని ప్రత్యేకతలివే!

దేశంలో అత్యంత ప్రముఖల పర్యటనల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన విమానాన్ని అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసింది. రెండు విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది.

Samayam Telugu 1 Oct 2020, 3:30 pm
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి,ప్రధాన మంత్రి వంటి ప్రముఖుల ప్రయాణాల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ‘ఎయిర్ ఇండియా వన్’ విమానం గురువారం భారత్‌కు చేరుకుంది. అమెరికా నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టులోనే దీనిని అమెరికా అప్పగించాల్సి ఉన్నా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగిందని అధికారులు వివరించారు. టెక్సాస్ నుంచి గురువారం తెల్లవారుజామున బయలుదేరిన ఈ విమానం ఏకధాటిగా 13వేల కిలోమీటర్లు ప్రయాణించింది.
Samayam Telugu ఎయిరిండియా విమానం


అమెరికా అధ్యక్షుడు వినియోగించే ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ తరహా రెండు బోయింగ్ -777 ఈఆర్ విమానాలకు భారత్ ఆర్డర్ ఇచ్చింది. మొత్తం 190 మిలియన్ డాలర్ల విలువైన ఈ విమానాలను జులైలోనే అప్పగించడానికి అమెరికా ఒప్పందం చేసుకుంది. కానీ, కరోనా వైరస్ కారణంగా మూడు నెలలు ఆలస్యమయ్యింది. తాజాగా, ఓ విమానాన్ని అమెరికా అందజేసింది. అన్ని పరీక్షలు ముగియడంతో దానిని అప్పగించినట్టు అధికారులు వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలు కలిగిన ‘ఎయిర్ ఇండియా వన్’ విమానం ఏకధాటిగా 17 గంటల పాటు ప్రయాణిస్తుంది.

B777 విమానాలలో లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రార్డ్ కౌంటర్‌మెజర్స్ (ఎల్ఏఐఆర్సీఎం) సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ (ఎస్పీఎస్)గా పిలిచే అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇందులో ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రపతి, ఉప-రాష్ట్రపతి, ప్రధాని తమ పర్యటనలకు బోయింగ్-747 విమానాలు వినియోగిస్తున్నారు. ఈ విమానాల నిర్వహణ బాధ్యతలను ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ చూస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.