యాప్నగరం

ఎయిరిండియా మరో షాక్: విమానంలో సాంకేతిక లోపం.. గాల్లో 370 ప్రాణాలు!

370 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ల్యాండింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం. గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం.. ఇంధనం అయిపోవడంతో మరింత టెన్షన్.. చివరికి పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో తప్పిన పెను ప్రమాదం.

Samayam Telugu 18 Sep 2018, 8:28 pm
యిరిండియా విమానం ప్రయాణికులను వణికించింది. పైలట్ ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా 370 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన.. అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సెప్టెంబరు 11న ఎయిరిండియాకు చెందిన ఏఐ-101 ఢిల్లీ నుంచి న్యూయార్క్ బయల్దేరింది.
Samayam Telugu Untitled1211


మరికొద్ది సేపటిలో న్యూయార్క్‌లోని జాన్‌ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుందనగా.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. కిందికి దింపేందుకు ఉపయోగించే మూడు ఇన్‌స్ట్రుమెంట్‌ ల్యాండింగ్‌ సిస్టమ్‌ (ILS) రిసీవరులు మొరాయించాయి. దీంతో పైలట్‌కు ల్యాండింగ్ సంకేతాలేవీ అందలేదు. దీంతో అప్రమత్తమైన పైలట్ కెప్టెన్ రస్తోమ్ పలియా వెంటనే న్యూయార్క్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు.

అదే సమయంలో న్యూయార్క్‌లోని వాతావరణం కూడా విమాన ల్యాండింగ్‌కు ప్రతికూలంగా మారింది. దీంతో.. 38 నిమిషాల పాటు విమానం గగనతలంలో చక్కర్లు కొడుతూనే ఉంది. వేరే విమానాశ్రయాల్లో దించాలని ప్రయత్నించినా.. ఇంధనం అక్కడి వరకు సరిపోదు. ఈ నేపథ్యంలో పైలట్ న్యూయార్క్‌కు సమీపంలోని నివార్క్ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఎయిరిండియా అధికారికంగా వెల్లడించకున్నా.. న్యూయార్క్‌లోని విమానాశ్రయ వర్గాల ద్వారా ఈ విషయం లీకైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.