అఖిలేష్ యాదవే మా తర్వాతి సీఎం- ములాయం
ఎన్నికల తర్వాత కూడా అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అవడంలో నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు అని..
TNN 9 Jan 2017, 10:39 pm
ఎన్నికల తర్వాత కూడా అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అవడంలో నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు అని స్పష్టంచేశారు సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్. తనకి తన కొడుకు అఖిలేష్కి మధ్య ఎటువంటి విబేధాలు లేవు అని ములాయం అన్నారు. సోమవారం రాత్రి ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ములాయం ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లడం కోసం మా పార్టీ ఐక్యంగానే కలిసి వుంటుందన్న ములాయం... పార్టీ రెండుగా చీలినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. త్వరలోనే ఐక్యంగా ప్రచారం మొదలుపెడతాం అని తేల్చిచెప్పారాయన.
ఇదిలావుంటే, పార్టీ రెండుగా చీలిపోతుందనే భయం ఒకవైపు, మరోవైపు ఎన్నికల్లో పోటీకి వెళ్లడానికి అవసరమయ్యే పార్టీ సింబల్ సైకిల్ గుర్తుపై పోరాటం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో రాజకీయంగా పార్టీకి డ్యామేజీ కలగకూడదనే ములాయం చివరకిలా మనసు మార్చుకున్నారని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లడం కోసం మా పార్టీ ఐక్యంగానే కలిసి వుంటుందన్న ములాయం... పార్టీ రెండుగా చీలినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. త్వరలోనే ఐక్యంగా ప్రచారం మొదలుపెడతాం అని తేల్చిచెప్పారాయన.
ఇదిలావుంటే, పార్టీ రెండుగా చీలిపోతుందనే భయం ఒకవైపు, మరోవైపు ఎన్నికల్లో పోటీకి వెళ్లడానికి అవసరమయ్యే పార్టీ సింబల్ సైకిల్ గుర్తుపై పోరాటం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో రాజకీయంగా పార్టీకి డ్యామేజీ కలగకూడదనే ములాయం చివరకిలా మనసు మార్చుకున్నారని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.