గుజరాత్లోని కొన్ని గిరిజన ప్రాంతాల్లో అఖిలేశ్ యాదవ్ ఫోటోతో కూడిన బ్యాగులను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛోటా ఉదేపూర్ జిల్లా పంచాయతీ పరిధిలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన ‘శాల’ (స్కూల్ ప్రవేశోత్సవం) కార్యక్రమంలో.. ఇలా జరగడంతో అందరూ విస్తూ పోతున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలో.. ఉత్తరప్రదేశ్ రాజకీయ నేత.. అందులోనూ యూపీ మాజీ సీఎం ఫోటోలతో కూడిన బ్యాగ్లను పంచడానికి వచ్చిన అవసరం ఏమిటి? ఇలా చేసిందెవరు అనే విషయంలో సర్వత్తా ఆసక్తి నెలకొంది.
ఈ విషయం వెలుగులోకి రావడంతో కొంత మంది సదరు బ్యాగులపై స్టిక్కర్లు అతికించే పనిలో పడ్డారు. అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్కు దీంతో ఏం సంబంధం ఉందో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ విషయం వెలుగులోకి రావడంతో కొంత మంది సదరు బ్యాగులపై స్టిక్కర్లు అతికించే పనిలో పడ్డారు. అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్కు దీంతో ఏం సంబంధం ఉందో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.