యాప్నగరం

మాయావతికి మద్దతుగా నిలిచిన అఖిలేష్ యాదవ్

కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో మోసానికి పాల్పడిందని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు(ఈవీఎం)లని

TNN 11 Mar 2017, 7:32 pm
కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో మోసానికి పాల్పడిందని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు(ఈవీఎం)లని ట్యాంపరింగ్ చేయడం వల్లే బీజేపీ భారీ మెజార్టీ సొంతం చేసుకోగలిగిందని బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి చేసిన ఆరోపణలపై ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. బీజేపీపై మాయావతి చేసిన ఆరోపణల్లో వాస్తవం వుందా లేదా అనేదానిపై కేంద్రం విచారణ జరిపించాలి అని ప్రభుత్వాన్ని కోరారు అఖిలేష్.
Samayam Telugu akhilesh yadav reacts to mayawati allegations on evms tampering in up polls
మాయావతికి మద్దతుగా నిలిచిన అఖిలేష్ యాదవ్


ఒక పార్టీ ఏదైనా ఆరోపణలు చేసిందంటే, ఆ ఆరోపణలపై విచారణ జరిపించడం ప్రభుత్వం బాధ్యత. మాయావతి చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టేవరకు తాము కూడా తమ వంతు పోరాటం కొనసాగిస్తాం అని అఖిలేష్ అభిప్రాయపడటం మాయావతి చేసిన వ్యాఖ్యలకి మరింత బలాన్ని చేకూర్చినట్టయింది.

ఇదిలావుంటే, ఇంతకాలం యూపీలో అధికారంలో వున్న అఖిలేష్ యాదవ్ ఏనాడూ మాయావతి చేసిన ఆరోపణలపై విచారణ జరపలేదు కానీ ఇప్పుడు తమ పార్టీ అధికారం కోల్పోగానే మాయావతి మాటలకి మద్దతు పలకడం హాస్యాస్పదంగా వుందని ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ నేతలు అఖిలేష్‌ని ఎద్దేవా చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.