యాప్నగరం

మళ్లీ బ్యాంకులకు వరుస సెలవులు

కస్టమర్లకు షాక్... మళ్లీ బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. దేశవ్యాప్తంగా రేపటి నుంచి (28-04-2018) - 30 వరకు బ్యాంకులు మూతపడనున్నాయి.

Samayam Telugu 30 Apr 2018, 2:39 pm
కస్టమర్లకు షాక్... మళ్లీ బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. దేశవ్యాప్తంగా రేపటి నుంచి (28-04-2018) 30 వరకు బ్యాంకులు మూతపడనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నాలుగు రోజులు సెలవులు కాగా... మరికొన్ని చోట్ల మూడు రోజులే సెలవులు. 28న నాలుగో శనివార, 29న ఆదివారం, 30న బుద్ధ పౌర్ణమి, 1న మేడే కావడంతో నాలుగు రోజులు హాలీడేస్. అయితే తెలుగు రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటూ మరికొన్ని చోట్ల 30న బ్యాంకులు పనిచేస్తాయి. మిగిలిన రోజుల్లో మాత్రం సెలవు. అలాగే కొన్ని చోట్ల నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం బ్యాంకులు సోమ (30), మంగళ (1)న పనిచేస్తాయి.
Samayam Telugu Banks


నాలుగు రోజులు సెలవులు రావడంతో... అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు బ్యాంకు అధికారులు. బ్యాంకులు పనిచేయకపోయినా... ఎప్పటికప్పుడు ఏటీఎంలలో డబ్బులు ఉండేలా చూస్తామంటున్నారు. కస్టమర్లు మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లను ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. గత నెలలో కూడా ఈలాగే బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.