యాప్నగరం

ఆ అయిదుగురు సైనికులు సురక్షితం

జమ్మూ కాశ్మీర్లో సైనికులపై హిమపాతం కొన్ని రోజులుగా విరుచుకుపడుతోంది.

TNN 28 Jan 2017, 7:01 pm
జమ్మూ కాశ్మీర్లో సైనికులపై హిమపాతం కొన్ని రోజులుగా విరుచుకుపడుతోంది. తాజాగా కుప్వారా జిల్లాలోని అయిదుగురు సైనికులపై మంచుచరియలు విరిగిపడ్డాయి. వారంతా మంచు చరియల కింద చిక్కుకున్నారు. సైనికులు మంచులో కూరుకుపోయారనే సంగతి తెలియగానే సహాయక సిబ్బంది క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. మంచుని అతి వేగంగా తొలగించి సైనికులను రక్షించగలిగారు. అయిదుగురు సైనికులు ప్రాణాలతో బయటపడడంతో సైన్యం ఊపిరిపీల్చుకుంది. అస్వస్థతకు గురైన అయిదుగురు సైనికులను ఆసుపత్రిలో చేర్చారు.
Samayam Telugu all 5 soldiers rescued who were trapped under snow in jk
ఆ అయిదుగురు సైనికులు సురక్షితం


మూడు రోజుల క్రితం రెండు భారీగా మంచు చరియలు విరిగిపడిన ఘటనలో 15 మంది జవానులు అమరులయ్యారు. మరో ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వాతావరణంలో మార్పుల వల్ల హఠాత్తుగా మంచుతుపానులు రావడం, మంచు చరియలు విరిగిపడడం జరుగుతోంది. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలన్ని కూడా పణంగా పెడుతూ అక్కడి సైనికులు మైనస్ డిగ్రీల వాతావరణంలో విధులు నిర్వర్తిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.