యాప్నగరం

ఆ రెండాకులు ఎవరివో తేలేది నేడే

జయలలిత పార్టీ అయిన అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు రెండు ఆకులు.

TNN 22 Mar 2017, 7:38 am
జయలలిత పార్టీ అయిన అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు రెండు ఆకులు.ఇప్పుడు అన్నాడీఎంకే రెండు విభాగాలుగా మారింది. శశికళ వర్గం, పన్నీరు వర్గంగా విడిపోయింది. అయితే ఇప్పుడు ఆర్కేనగర్ ఉపఎన్నిక ఉంది. అక్కడ పన్నీరు, చిన్నమ్మ వర్గాల నుంచి అభ్యర్థులు పోటీలో నిలిచారు. కాగా రెండాకులు చిహ్నంకోసం రెండు వర్గాలు కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నాయి. కేంద్రఎన్నికల కమిషన్ దీనిపై విచారణ చేస్తోంది. బుధవారం తుది విచారణ చేసి ఆ రెండాకులు ఎవరికి చెందాతాయో తేల్చి చెప్పనుంది. పన్నీరు సెల్వం వర్గం, శశికళ వర్గం కూడా ఇప్పటికే పలుమార్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి ఆ చిహ్నం తమకే చెందాలని విన్నవించుకుని, ఎందుకు చెందాలో కూడా కొన్ని ఆధారాలు చూపించిమ రీ వచ్చారట
Samayam Telugu all eyes on ec call on two leaves symbol
ఆ రెండాకులు ఎవరివో తేలేది నేడే


రెండు వర్గాలు ఎవరికి వారే ఆ చిహ్నం తమకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. రెండాకులు చిహ్నం తమిళ ప్రజల్లో బాగా నాటుకుపోయింది. గెలుపుకు ఆ గుర్తు కూడా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ మంది పార్టీ ఎమ్మెల్యేలంతా శశికళ వర్గంలోనే ఉన్నారు కనుక... ఆ గుర్తు వారికే ఎన్నికల కమిషన్ కేటాయిస్తుందని పలువురు భావిస్తున్నారు. మరి పన్నీరు ఎలాంటి ఆధారాలు కమిషన్ కు చూపించారో... అవి ఎంతవరకు పనిచేస్తాయో... ఆయన వర్గం వారికే తెలియాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.