మూడు నెలల పాటూ పెళ్లిళ్లు రద్దు చేసుకోవాలంటోంది ఉత్తరప్రదేశ్ సర్కార్. వివాహాలకు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటే వాటిని విరమించుకోవాలని సూచిస్తోంది. అదేంటి ప్రభుత్వమే పెళ్లిళ్లను రద్దు చేసుకోమని చెప్పడం ఏంటని షాక్ అవుతున్నారా. మీరు వింటున్నది నిజమే.. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ప్రయాగ్ రాజ్ (అలహాబాద్)లో మాత్రమే ఈ వివాహ వేడుకలు వద్దంటోంది. ఈ నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉందని చెబుతోంది యోగీ ఆదిత్యనాథ్ సర్కార్.
ప్రయాగ్ రాజ్లో వచ్చే ఏడాది కుంభమేళా జరగబోతోంది. జనవరిలో మకర సంక్రాంతి, పౌష్ పూర్ణిమ, ఫిబ్రవరిలో మౌని అమావాస్య, బసంత్ పంచమి, మాగి పూర్ణిమ రోజుల్లో, మార్చిలో మహాశివరాత్రి పూట జరిగే స్నానాల సమయంలో భారీ ఎత్తున భక్తులు వస్తారట. జనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వివాహ వేడుకలకు ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతోంది. అందుకే పెళ్లిళ్లను వాయిదా వేసుకోవాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అలహాబాద్ అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫంక్షన్ హాళ్లు, హోటల్స్ యజమానులకు ఆర్డర్ కాపీలను పంపించారు. ఆ మూడు నెలల్లో ఎవరైనా అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకొని ఉంటే వాటిని రద్దు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే పెళ్లిళ్ల కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్లు వాటిని రద్దు చేసుకుంటున్నారు. కొందరు వివాహాలను వాయిదా వేసుకుంటుండగా.. మరికొందరు మరో ప్రాంతంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు ప్రభుత్వ ఆదేశాలతో ఫంక్షన్ హాళ్లు, హోటళ్ల యజమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు . మూడు నెలల పాటూ పెళ్లిళ్లు లేకపోతే.. తమకు భారీగా నష్టం వస్తుందంటున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లు చాలా జరిగాయని.. ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పుడు అవన్నీ రద్దయ్యాయంటున్నారు.
ప్రయాగ్ రాజ్లో వచ్చే ఏడాది కుంభమేళా జరగబోతోంది. జనవరిలో మకర సంక్రాంతి, పౌష్ పూర్ణిమ, ఫిబ్రవరిలో మౌని అమావాస్య, బసంత్ పంచమి, మాగి పూర్ణిమ రోజుల్లో, మార్చిలో మహాశివరాత్రి పూట జరిగే స్నానాల సమయంలో భారీ ఎత్తున భక్తులు వస్తారట. జనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వివాహ వేడుకలకు ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతోంది. అందుకే పెళ్లిళ్లను వాయిదా వేసుకోవాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అలహాబాద్ అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫంక్షన్ హాళ్లు, హోటల్స్ యజమానులకు ఆర్డర్ కాపీలను పంపించారు. ఆ మూడు నెలల్లో ఎవరైనా అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకొని ఉంటే వాటిని రద్దు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే పెళ్లిళ్ల కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్లు వాటిని రద్దు చేసుకుంటున్నారు. కొందరు వివాహాలను వాయిదా వేసుకుంటుండగా.. మరికొందరు మరో ప్రాంతంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు ప్రభుత్వ ఆదేశాలతో ఫంక్షన్ హాళ్లు, హోటళ్ల యజమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు . మూడు నెలల పాటూ పెళ్లిళ్లు లేకపోతే.. తమకు భారీగా నష్టం వస్తుందంటున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లు చాలా జరిగాయని.. ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పుడు అవన్నీ రద్దయ్యాయంటున్నారు.