ఉత్తరప్రదేశ్లోని ఓ పోలింగ్బూత్లో అధికారులు చివరి నిమిషం వరకూ వేచి చూసినా.. ఒక్కరు కూడా ఓటు వేయడానికి రాలేదు. గ్రామస్థులందరూ మూకుమ్మడిగా ఫిబ్రవరి 27న నిర్వహించిన ఓటింగ్ను పూర్తిగా బహిష్కరించడంతో.. పోలింగ్ సిబ్బంది సమయం పూర్తయ్యే వరకూ చూసి ఖాళీ చేతులతో వెనుదిరిగారు. గ్రామంలోని మొత్తం 649 మంది ఓటర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఓటు వేయ లేదు. ఈ గ్రామం రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ పరిధిలోనిది కావడం గమనార్హం.
ఎన్నికలు వస్తున్నాయనగానే రాజకీయ నాయకులు రావడం.. గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మాటివ్వడం.. తీరా ఎన్నికలైపోయాక మొహం చాటేయడం.. గత 30 ఏళ్లుగా ఇలానే జరుగుతోందట యూపీలోని పర్సౌలీ గ్రామంలో. ఎలాగైనా ఈ సారి రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగించాల్సిందే అని జనవరిలోనే తీర్మానించుకున్న గ్రామస్థులు అనుకున్నట్టే చేసి, అందరి దృష్టినీ తమవైపు తిప్పుకున్నారు. అమేథీకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా.. బయటి ప్రపంచంతో అనుసంధానించే సరైన రోడ్డు వసతి కూడా లేదట. ప్రధాన రోడ్డుకు కలిపే తమ గ్రామ రహదారిని 30 ఏళ్ల కింద సంజయ్ గాంధీ హయాంలో వేశారట. 2004లో రాహుల్ గాంధీ మోకాళ్ల లోతు నీటిని దాటుకుంటూ గ్రామంలోకి వచ్చారట. ఆయన కూడా ఇప్పటివరకూ ఆ గ్రామానికేం చేయలేదట.
రోడ్డు వసతి లేక గ్రామానికి చెందిన పిల్లలకు సరైన విద్యా సదుపాయాలు కూడా అందట్లేదట. అంతే కాకుండా.. ఆ ఊర్లో ఏ ఒక్క ఇంటికీ సరైన టాయిలెట్, మంచి నీటి సౌకర్యం కూడా లేదట. ‘మమ్మల్ని ఇన్ని ఇబ్బందుల్లోకి నెట్టినవాళ్లకు ఎలా ఓటేయమంటారు? రాజకీయ పార్టీలన్నింటికీ గుణపాఠం చెప్పాలనే ఇలా చేశాం’ అంటున్నారు ఆ గ్రామస్థులు. వారి కోరిక ఇప్పటికైనా తీరుతుందా.. చూడాలి.
ఎన్నికలు వస్తున్నాయనగానే రాజకీయ నాయకులు రావడం.. గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మాటివ్వడం.. తీరా ఎన్నికలైపోయాక మొహం చాటేయడం.. గత 30 ఏళ్లుగా ఇలానే జరుగుతోందట యూపీలోని పర్సౌలీ గ్రామంలో. ఎలాగైనా ఈ సారి రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగించాల్సిందే అని జనవరిలోనే తీర్మానించుకున్న గ్రామస్థులు అనుకున్నట్టే చేసి, అందరి దృష్టినీ తమవైపు తిప్పుకున్నారు. అమేథీకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా.. బయటి ప్రపంచంతో అనుసంధానించే సరైన రోడ్డు వసతి కూడా లేదట. ప్రధాన రోడ్డుకు కలిపే తమ గ్రామ రహదారిని 30 ఏళ్ల కింద సంజయ్ గాంధీ హయాంలో వేశారట. 2004లో రాహుల్ గాంధీ మోకాళ్ల లోతు నీటిని దాటుకుంటూ గ్రామంలోకి వచ్చారట. ఆయన కూడా ఇప్పటివరకూ ఆ గ్రామానికేం చేయలేదట.
రోడ్డు వసతి లేక గ్రామానికి చెందిన పిల్లలకు సరైన విద్యా సదుపాయాలు కూడా అందట్లేదట. అంతే కాకుండా.. ఆ ఊర్లో ఏ ఒక్క ఇంటికీ సరైన టాయిలెట్, మంచి నీటి సౌకర్యం కూడా లేదట. ‘మమ్మల్ని ఇన్ని ఇబ్బందుల్లోకి నెట్టినవాళ్లకు ఎలా ఓటేయమంటారు? రాజకీయ పార్టీలన్నింటికీ గుణపాఠం చెప్పాలనే ఇలా చేశాం’ అంటున్నారు ఆ గ్రామస్థులు. వారి కోరిక ఇప్పటికైనా తీరుతుందా.. చూడాలి.