దశాబ్దానికిపైగా సూడాన్లో సైన్యం, శక్తిమంతమైన పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా, అక్కడ పరిస్థితి మరింత కల్లోలంగా మారింది. ఘర్షణలు చెలరేగి రాజధాని సహా పలుచోట్ల కాల్పులు, బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. పలుచోట్ల జరిగి ఘటనల్లో 27 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సూడాన్లోని భారతీయుల భద్రతకు సంబంధించి అక్కడ భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. భారతీయులు ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని సూచించింది. తదుపరి ప్రకటన చేసేవరకూ దయచేసి ప్రశాంతంగా ఉండాలని స్పష్టం చేసింది. ‘కాల్పులు, ఘర్షణల దృష్ట్యా, భారతీయులందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇళ్లకే పరిమితం కావాలి.. బయటికి వెళ్లడం మానేయాలని సూచించారు.. దయచేసి ప్రశాంతంగా ఉండండి.. తదుపరి ప్రకటన కోసం వేచి ఉండండి’ అని ఖార్తూమ్లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. పారా మిలటరీ ‘ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్’ను సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదన అగ్నికి ఆజ్యం పోసింది. ఇది ఆర్మీ-పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఈ అంశంపై సైన్యాధినేత అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్, పారా మిలటరీ కమాండర్ మహ్మద్ హందాన్ డగ్లో మధ్య కొన్ని వారాలుగా నెలకున్న విభేదాలు ఇప్పుడు తీరాస్థాయికి చేరాయి.
ఈ క్రమంలోనే సూడాన్ రాజధాని ఖార్తూమ్ సహా పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డాయి. పౌరులు భయాందోళనలకు గురై వీధుల్లో పరుగులు తీశారు. సూడాన్ అధ్యక్ష భవనం, బుర్హాన్ నివాసం, ఖార్తూమ్లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆర్ఎస్ఎఫ్ ప్రకటించుకుంది. ఎయిర్పోర్ట్ సమీపంతో పాటు ఉత్తర ఖర్తోమ్లోని బుర్హాన్ నివాసం వద్ద కాల్పులు శబ్దం వినిపించింది.
2021లో సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి సూడాన్లో ఉద్రిక్తతలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రపంచ దేశాల చొరవతో అంతర్జాతీయ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ప్రయత్నించినా ఘర్షణల వల్ల అది సాధ్యం కావడం లేదు. తాజా ఘర్షణలపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఖార్టూమ్లోని సోబాలోని శిబిరాల్లోకి సైన్యం పెద్ద సంఖ్యలో ప్రవేశించడం, అక్కడ పారామిలిటరీలను ముట్టడించడంతో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ను శనివారం ఆశ్చర్యానికి గురిచేసిందని ఒక ప్రకటనలో తెలిపింది. భారీ, తేలికపాటి ఆయుధాలతో సహా అన్ని రకాల ఆయుధాలతో భారీ దాడి జరుగుతోందని పేర్కొంది.
Read More Latest International News And Telugu News
ఈ క్రమంలోనే సూడాన్ రాజధాని ఖార్తూమ్ సహా పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డాయి. పౌరులు భయాందోళనలకు గురై వీధుల్లో పరుగులు తీశారు. సూడాన్ అధ్యక్ష భవనం, బుర్హాన్ నివాసం, ఖార్తూమ్లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆర్ఎస్ఎఫ్ ప్రకటించుకుంది. ఎయిర్పోర్ట్ సమీపంతో పాటు ఉత్తర ఖర్తోమ్లోని బుర్హాన్ నివాసం వద్ద కాల్పులు శబ్దం వినిపించింది.
2021లో సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి సూడాన్లో ఉద్రిక్తతలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రపంచ దేశాల చొరవతో అంతర్జాతీయ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ప్రయత్నించినా ఘర్షణల వల్ల అది సాధ్యం కావడం లేదు. తాజా ఘర్షణలపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఖార్టూమ్లోని సోబాలోని శిబిరాల్లోకి సైన్యం పెద్ద సంఖ్యలో ప్రవేశించడం, అక్కడ పారామిలిటరీలను ముట్టడించడంతో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ను శనివారం ఆశ్చర్యానికి గురిచేసిందని ఒక ప్రకటనలో తెలిపింది. భారీ, తేలికపాటి ఆయుధాలతో సహా అన్ని రకాల ఆయుధాలతో భారీ దాడి జరుగుతోందని పేర్కొంది.
Read More Latest International News And Telugu News