యాప్నగరం

దేశవ్యాప్తంగా సీఏఏపై నిరసనలు.. పాక్ మహిళకు భారత పౌరసత్వం

పొరుగుదేశం నుంచి వచ్చిన ఆరు మతాలవారికి భారత పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతుండగా ఓ పాక్ మహిళకు భారత పౌరసత్వం లభించింది.

Samayam Telugu 20 Dec 2019, 4:14 pm
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు కొనసాగుతుండగా పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళకు భారత పౌరసత్వం లభించింది. గుజరాత్‌లోని భాన్వాడ్‌ తాలూకాలో జన్మించిన హసీనా బెన్‌ అనే మహిళ 1999లో పాక్ వ్యక్తిని వివాహం చేసుకుంది. అనంతరం పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడి పౌరసత్వాన్ని స్వీకరించింది. కొన్నాళ్ల తర్వాత భర్త మరణించడంతో భారత్‌కు తిరిగి రావాలని హసీనా నిర్ణయించుకుంది. దీంతో రెండేళ్ల కిందట భారత పౌరసత్వం కోరుతూ వ్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న భారత ప్రభుత్వం డిసెంబరు 18న పౌరసత్వం మంజూరు చేసింది. ద్వారక జిల్లా కలెక్టర్‌ నరేంద్ర కుమార్‌ మీనా ఆమెకు భారత పౌరసత్వ ధ్రువ పత్రాన్ని గురువారం అందజేశారు.
Samayam Telugu pak.


కాగా, పాకిస్థాన్ నుంచి వచ్చి భారతీయుడ్ని వివాహం చేసుకున్న ఓ పాక్ మహిళకు 35 ఏళ్ల తర్వాత గత అక్టోబరులో భారత పౌరసత్వం లభించింది. పాకిస్థాన్‌కు చెందిన జుబేదా బేగం యూపీలోని ముజఫర్‌నగర్‌కు చెందిన వ్యక్తితో 1985లో వివాహమైంది. ఏడేళ్ల వీసాపై భారత్‌కు వచ్చిన జుబేదా.. దాని గడువు తీరిపోవడంతో 1994లో భారత పౌరసత్వం కోసం దరఖాస్తుచేసింది. వీసా గడువు ముగిసిన సుదీర్ఘకాలం తర్వాత ఆమెకు భారతీయ పౌరసత్వం మంజూరు చేశారు.

కాగా, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. యూపీ, మంగళూరులో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నారు. ఆందోళనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో యూపీలో ఒకరు, మంగళూరులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రజనీ ట్విటర్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.