యాప్నగరం

అంత సీన్ లేదు.. అవిశ్వాసాన్ని ఓడిస్తాం: అమిత్ షా

కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై అమిత్ షా స్పందించారు. తీర్మానాన్ని సునాయాసంగా ఓడిస్తామన్నారు. ఎన్డీఏకు 300మందికిపైగా సభ్యుల మెజార్టీ ఉందని ధీమా వ్యక్తం చేశారు.

Samayam Telugu 18 Mar 2018, 12:35 pm
కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై అమిత్ షా స్పందించారు. తీర్మానాన్ని సునాయాసంగా ఓడిస్తామన్నారు. ఎన్డీఏకు 300మందికిపైగా సభ్యుల మెజార్టీ ఉందని ధీమా వ్యక్తం చేశారు. అవిశ్వాసం ఇంత ఆలస్యంగా ఎందుకు పెట్టారు... తాము తీర్మానాన్ని ఎదుర్కోవడానిక సిద్ధంగా ఉన్నామన్నారు. నిబంధనల ప్రకారం సభలో చర్చ జరగాల్సి ఉంటుందని... ఒకవేళ ఓటింగ్ జరిగినా అది నెగ్గదని కాంగ్రెస్, ఇతర పార్టీలకు బాగా తెలుసని అభిప్రాయపడ్డారు. అందుకే సభ సజావుగా జరగకుండా అట్టుకుంటున్నారని విమర్శించారు.
Samayam Telugu amit shah responds on no confidence motion in lok sabha
అంత సీన్ లేదు.. అవిశ్వాసాన్ని ఓడిస్తాం: అమిత్ షా


ఒకప్పుడు ఇందిర వర్సెస్ మిగిలిన పార్టీలుగా ఉండేదని... ఇప్పుడు మోదీ ఒకటైతే... ప్రతిపక్షాలన్నీ కలిపితే మరొక ఎత్తన్నారు. 2019 ఎన్నికల్లో ఇలాంటి పోరే ఉంటుందన్నారు. కాంగ్రెస్ విందు సమావేశం జరిపితే... తాము మాత్రం నేరుగా ప్రజలతోనే మమేకమవుతామని... ఆ పార్టీ ఏర్పాటు చేసిన విందుపై పరోక్షంగా స్పందించారు. విజయవంతమైన ప్రధానిగా మోదీ నిరూపించుకున్నారని... ప్రజలు మరోసారి ఆయనపై నమ్మకాన్ని చూపిస్తారా... లేక మరో కూటమికి ఓటేస్తారో వాళ్లే నిర్ణయించుకోవాలన్నారు. 2019లో గెలుపుపై కాంగ్రెస్ కలలు కంటోందని... అవి కల్లలేనని ఎద్దేవా చేశారు. బీజేపీ 2014లో కంటే ఎక్కువ సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.