యాప్నగరం

ఆయన హిందువైతే, తరచూ ఆలయాలకు ఎందుకెళ్లరు?

గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

TNN 3 Dec 2017, 12:07 pm
గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన రాహుల్ అన్యమతస్థుల రికార్డులో సంతకం చేయడంపై బీజేపీ విమర్శలు గుప్పించగా, కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అసలు హిందువే కాదంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై అమిత్ షా స్పందిస్తూ గత ఆరు తరాలుగా తాము హిందువులగానే ఉన్నామని అన్నారు. అలాగే రాహుల్ హిందువైతే తరుచూ ఎందుకు ఢిల్లీలోని ఆలయాలను దర్శించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఆరోపణలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ఆరు తరాలుగా మేము హిందువులమేనని స్పష్టం చేశారు. ఎవరి విశ్వాసాలను కించపరచడం తమ ఉద్దేశం కాదని, సోమనాథ్ ఆలయాన్ని దర్శించిన రాహుల్ గాంధీ అన్యమతస్థుల రికార్డులో ఎందుకు సంతకం చేశారో సమాధానం చెప్పాలని ఆయన పేర్కొన్నారు.
Samayam Telugu amit shah why doesnt rahul gandhi visit temples in delhi
ఆయన హిందువైతే, తరచూ ఆలయాలకు ఎందుకెళ్లరు?


ఈ విషయంలో సోనియా గాంధీకి కూడా ఎలాంటి సమస్య లేనప్పుడు, కాంగ్రెస్ పార్టీ హఠాత్తుగా ఎందుకు రాద్దాంతం చేస్తోందని అన్నారు. అలాగే తన కుమారుడు జై షా వ్యాపార లావాదేవీలపై కూడా కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని, వ్యాపార నిర్వహణ, లాభాల మధ్య వ్యత్యాసానని రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు అవగాహన చేసుకోవాలని సూచించారు. సోమనాథ్ ఆలయంలో రాహుల్ గాంధీ సంతకాన్ని బీజేపీ తారుమారు చేసినట్లు కాంగ్రెస్ ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తన పరివారంతో ఆలయంలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మీడియా సమన్వయకర్త సమక్షంలోనే ఈ రికార్డులో సంతకం చేశాడని, ఇందులో ఆలయ బోర్డు అవకతవకలకు పాల్పడలేదని అమిత్ షా వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.