యాప్నగరం

అమృత్‌సర్ రైలు ప్రమాదం: విచారణకు ఆదేశించిన పంజాబ్ సీఎం

అమృత్‌సర్ రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పరామర్శించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు, నాాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని సూచించారు.

Samayam Telugu 20 Oct 2018, 2:19 pm
అమృత్‌సర్ రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పరామర్శించారు. అమన్‌దీప్ హాస్పిటల్‌లో ఆయన క్షతగ్రాతుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విజయదశమి సందర్భంగా రావణ దహనం చేస్తుండగా.. పట్టాలపై నిలబడి వీక్షిస్తోన్న వారి మీదుగా రైలు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 58 మందికిపైగా మరణించగా, 72 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం జరిగిన ఈ ఘటన యావత్ భారతావనిని విస్మయానికి గురి చేసింది.
Samayam Telugu amritsar


ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం అమరీందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడం కోసం తక్షణమే రూ.3 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని, నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆయన పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు.

ప్రమాద వార్త తెలిసిన వెంటనే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని సీఎం ప్రకటించారు. గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందిస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.