తను జయలలిత కొడుకు అంటూ ఇది వరకూ ఒక వ్యక్తి కోర్టుకు ఎక్కాడు. జయమరణానంతరం అతడు కోర్టులో ఆ మేరకు పిటిషన్ వేశాడు. తను జయ, శోభన్బాబులకు పుట్టాను అని అతడు వాదించాడు. అయితే అతడు సమర్పించిన ఆధారాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్థం లేని ఆధారాలను చూపించి.. కోర్టు సమయాన్ని వ్యర్థం చేసినందుకు అతడిని న్యాయస్థానం దండించి పంపించింది.
మరి ఆ విషయం మరవక ముందే ఇప్పుడు తను జయలలిత కూతురిని అంటూ ఒకామె ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రాష్ట్రపతి కోవింద్ లకు లేఖ రాసింది. బెంగళూరుకు చెందిన అమృత, తను తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూతురు అని, జయ-శోభన్ బాబుల ప్రేమకు ప్రతిఫలంగా తను పుట్టాను అని వాదిస్తోంది.
జయలలిత, శోభన్ బాబులు ప్రేమించుకున్నారని, అయితే సమాజం కట్టుబాట్లకు భయపడి పెళ్లి చేసుకోలేదని.. ఆ సమయంలో పుట్టిన తనను జయలలిత, సోదరి శైలజకు అప్పగించిందని అమృత అంటోంది. ఇలా తన జీవితం అంతా రహస్యంగా సాగిపోయిందని.. జయలలితకు తనే అసలైన వారసురాలిని అని ఈమె అంటోంది.
ఈ విషయంలో నిజానిజాలు రాబట్టాలని.. అమృత ఏకంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి లకు లేఖలు రాయడం గమనార్హం. కావాలంటే డీఎన్ఏ టెస్టును చేసుకోవచ్చని.. తను జయలలిత కూతురిని అని నిర్ధారణ అవుతుందని ఈమె వాదిస్తోంది. తను ఒకసారి జయను కలిశానని, అప్పుడు ఆమె ఆప్యాయంగా పలకరించిందని అమృత చెప్పుకొచ్చింది. మరి ఈమె ఇన్నేళ్లూ ఏం చేసినట్టు? జయ మరణించి కూడా చాన్నాళ్లే అవుతోంది కదా.. ఇన్నాళ్లైనా ఎందుకు మేలుకోలేదు? అనే సందేహాలు సహజంగానే వస్తాయి.
మరి ఆ విషయం మరవక ముందే ఇప్పుడు తను జయలలిత కూతురిని అంటూ ఒకామె ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రాష్ట్రపతి కోవింద్ లకు లేఖ రాసింది. బెంగళూరుకు చెందిన అమృత, తను తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూతురు అని, జయ-శోభన్ బాబుల ప్రేమకు ప్రతిఫలంగా తను పుట్టాను అని వాదిస్తోంది.
జయలలిత, శోభన్ బాబులు ప్రేమించుకున్నారని, అయితే సమాజం కట్టుబాట్లకు భయపడి పెళ్లి చేసుకోలేదని.. ఆ సమయంలో పుట్టిన తనను జయలలిత, సోదరి శైలజకు అప్పగించిందని అమృత అంటోంది. ఇలా తన జీవితం అంతా రహస్యంగా సాగిపోయిందని.. జయలలితకు తనే అసలైన వారసురాలిని అని ఈమె అంటోంది.
ఈ విషయంలో నిజానిజాలు రాబట్టాలని.. అమృత ఏకంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి లకు లేఖలు రాయడం గమనార్హం. కావాలంటే డీఎన్ఏ టెస్టును చేసుకోవచ్చని.. తను జయలలిత కూతురిని అని నిర్ధారణ అవుతుందని ఈమె వాదిస్తోంది. తను ఒకసారి జయను కలిశానని, అప్పుడు ఆమె ఆప్యాయంగా పలకరించిందని అమృత చెప్పుకొచ్చింది. మరి ఈమె ఇన్నేళ్లూ ఏం చేసినట్టు? జయ మరణించి కూడా చాన్నాళ్లే అవుతోంది కదా.. ఇన్నాళ్లైనా ఎందుకు మేలుకోలేదు? అనే సందేహాలు సహజంగానే వస్తాయి.