యాప్నగరం

జయ కూతురినంటూ పిటిషన్‌.. అమృతపై సుప్రీంకోర్టు ఆగ్రహం

తాను జయలలిత కుమార్తెనేనని, కావాలంటే డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించవచ్చునని బెంగళూరు చెందిన అమృత సారథి అలియాస్ మంజుల (37) సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. సుప్రీంకోర్టు సోమవారం (నవంబర్ 27) ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది.

TNN 27 Nov 2017, 3:13 pm
జయలలిత వారసురాలినంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహిళకు చుక్కెదురైంది. తాను జయలలిత కుమార్తెనేనని, కావాలంటే తనకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించవచ్చునని బెంగళూరు చెందిన అమృత సారథి అలియాస్ మంజుల (37) అనే మహిళ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు సోమవారం (నవంబర్ 27) ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. కర్ణాటక హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టు ఎందుకొచ్చారంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Samayam Telugu amruthas plea claiming to be jayalalithaas daughter dismissed by supreme court
జయ కూతురినంటూ పిటిషన్‌.. అమృతపై సుప్రీంకోర్టు ఆగ్రహం


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వారసురాలిని తానేనని నవంబర్ 22న అమృత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ‘నేను జయలలిత కూతుర్నే. జయలలిత సోదరి నన్ను పెంచి పెద్ద చేశారు. జయలలిత మృతి చెందిన తర్వాత నాకు ఈ రహస్యాన్ని చెప్పారు’ అని ఆమె పేర్కొంది.

గత ఏడాది డిసెంబర్‌లో అనారోగ్యంతో ప్రాణాలు విడిచిన జయలలిత జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అవివాహితగానే ఉన్నారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలో జయ మృతి చెంది ఏడాది కావస్తున్న తర్వాత కూడా ఆమె వారసులం తామంటే తామేనంటూ.. పలువురు ముందుకొస్తుండటం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.