యాప్నగరం

లాక్‌డౌన్‌లో నా పరిస్థితి ఈ కారులానే ఉంది: ఆనంద్ మహీంద్రా​​

Scorpio Tied to Tree: ఇనుప గొలుసులతో చెట్టుకు కట్టేసి ఉన్న ఓ స్కార్పియో వాహనం ఫోటోలను షేర్ చేస్తూ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆసక్తికర కామెంట్ పెట్టారు.

Samayam Telugu 7 Nov 2020, 8:43 pm
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర చేసే ట్వీట్లు ఆసక్తికరంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆయన ట్వీట్ చేసిన ఓ మహీంద్రా స్కార్పియో వాహనం ఫోటో వైరల్ అవుతోంది. ఆ వాహన యజమాని దాన్ని గొలుసుతో చెట్టుకు బంధించడమే అందుక్కారణం. దానికి ఆనంద్ మహీంద్ర ఇచ్చిన క్యాప్షన్ మరింత ఆసక్తికరంగా ఉంది.
Samayam Telugu ఆనంద్ మహీంద్ర ట్వీట్
Anand Mahindra Tweets Scorpio Photo


ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేసి ఉన్న ఓ బ్లాక్‌ మహీంద్రా స్కార్పియో ఫోటోను ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. లాక్‌డౌన్‌‌లో తన పరిస్థితి కూడా అలాగే ఉందనే అర్థం వచ్చేలా దానికి ఆయన కామెంట్ పెట్టారు.

‘వాహనానికి అత్యాధునిక లాకింగ్‌ సిస్టమ్‌ ఉన్నప్పటికీ.. దాన్ని గొలుసుతో కట్టేయడమనేది యజమాని స్వాధీనతను తెలియజేస్తోంది. ఈ లాక్‌డౌన్‌‌లో నేనూ ఎలా ఉన్నాననే విషయాన్ని ఈ చిత్రం పర్‌ఫెక్ట్‌గా వివరిస్తుంది. ఈ వీకెండ్‌లో నేను దాన్ని చేధించి బయటకు రాబోతున్నా.. (మాస్కుతో )’ అని ఆనంద్ మహీంద్ర పోస్ట్‌ చేశారు.


ఆనంద్ మహీంద్ర ట్వీట్‌కు నెటిజన్ల నుంచి లైక్‌లు, కామెంట్లు వస్తున్నాయి. ఆ కారు యజమానికి టెక్నాలజీ కంటే గొలుసుపైనే ఎక్కువ నమ్మకం ఉన్నట్టుందని ఓ నెటిజన్ కామెంట్‌ చేశాడు. మనలోని చెడు ఆలోచనలను కూడా ఇలా గొలుసుతో బంధించాలంటూ మరో నెటిజన్ విలువల గురించి చెప్పే ప్రయత్నం చేశారు.

Also Read: చివరి క్షణంలో సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన

Must Read: భర్తను ప్రియురాలితో కలిపిన భార్య.. మూడేళ్ల తర్వాత త్యాగం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.