యాప్నగరం

కేంద్రమంత్రి అనంతకుమార్ అంత్యక్రియలు పూర్తి

కేంద్రమంత్రి అనంతకుమార్‌కు తుది వీడ్కోలు.. బెంగళూరులో అధికార లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు..

Samayam Telugu 13 Nov 2018, 5:06 pm
కేన్సర్‌తో బాధపడుతూ కన్నుమూసిన కేంద్రమంత్రి అనంత్‌కుమార్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. బెంగళూరులోని చామరాజపేట శ్మశానవాటికలో మంగళవారం సాయంత్రం అనంత్‌కు సోదరుడు నందకుమార్ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కేంద్రమంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, నిర్మలా సీతారామన్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌, పియూష్‌ గోయల్‌, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీతో పాటూ కర్ణాటక బీజేపీ నేతలు అంత్యక్రియలకు హాజరై తుది వీడ్కోలు పలికారు.
Samayam Telugu ananthakumar


అంతక ముందు అనంత్‌కుమార్ భౌతికకాయాన్ని.. ఆయన నివాసం నుంచి బీజేపీ ఆఫీస్‌కు తీసుకొచ్చారు. అక్కడ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనంత్‌ పార్థీవదేహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం నేషనల్‌ కళాశాల మైదానానికి తరలించారు. అక్కడి నుంచి అంతిమయాత్ర బయల్దేరి చామరాజపేట్‌ శ్మశానవాటికకు చేరింది.

కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న అనంత్‌కుమార్ న్యూయార్క్ హాస్పిటల్‌లో చికిత్సపొందారు. కొద్ది రోజుల క్రితం ఆయన్ను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్సపొందుతూ.. సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.