యాప్నగరం

వైద్యులపై కేంద్ర మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు

ప్రభుత్వాస్పత్రిలో జనరిక్ ఔషధాల దుకాణం ప్రారంభం సందర్భంగా కేంద్ర మంత్రి వైద్యులనుద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగుతున్నాయి.

TNN 26 Dec 2017, 11:10 am
ప్రభుత్వాస్పత్రిలో జనరిక్ ఔషధాల దుకాణం ప్రారంభం సందర్భంగా సీనియర్ వైద్యులు హాజరుకాకపోవడంపై కేంద్ర మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చంద్రపూర్‌లో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో 24 గంటల జనరిక్ మందుల దుకాణం ప్రారంభానికి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్, డిప్యూటీ మేయర్‌తోపాటు ఇతర అధికారులు హజరైనా, హాస్పిటల్ సీనియర్ డాక్టర్లు మాత్రం రాలేదు. దీనిపై కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేని ఇలాంటి వ్యక్తులు మావోయిస్టుల్లో చేరాలని, ప్రభుత్వం మిమ్మల్ని కాల్చిపారేస్తుందని అన్నారు.
Samayam Telugu angry over doctors absence from event hansraj ahir tells them to join naxals so they can be shot
వైద్యులపై కేంద్ర మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు


నక్సల్స్‌ ప్రజాస్వామ్యాన్ని కోరుకోవడం లేదు... ఈ కార్యక్రమానికి హాజరుకాని వైద్యులకు కూడా ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదని, అందుకే వారితోపాటు ఉద్యమాల్లో చేరండి... మీకు మేము బుల్లెట్లను పంపుతామని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఓ మంత్రి హాస్పిటల్ పర్యటనకు వచ్చినప్పుడు సంబంధిత వైద్యులు సెలవుల్లో ఉండటం ఆశ్చర్యానికి గురిచేసిందని అహిర్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర తూర్పు ప్రాంతంలోని నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో ఒకటిగా చంద్రపూర్‌ను కేంద్రం గుర్తించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.