యాప్నగరం

Resort Case అంకిత కుటుంబానికి రూ.25 లక్షల సాయం: ఉత్తరాఖండ్ సీఎం ప్రకటన

దర్యాప్తు ప్రాథమిక స్థాయిలో ఉండగానే రిసార్టును కూల్చివేయడం, తగులబెట్టడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హత్యకు గురైన యువతి ఉన్న గది దర్యాప్తు మరింత లోతుగా సాగడానికి ఎంతో అవసరం. వ్యభిచారం చేయమన్నా ఒత్తిడికి లొంగనందునే ఆమెను పులకిత్ ఆర్య హత్యచేసిన నేపథ్యంలో రిసార్టు కూల్చివేయడానికి బదులు దానిని సీల్ చేయాలి. కానీ, అలా జరగలేదు. మరోవైపు, బాధిత కుటుంబానికి సీఎం ధామీ ఆర్థిక సాయం ప్రకటించారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 28 Sep 2022, 3:53 pm
అంకితా భండారీ హత్యపై (Ankita Bhandari) ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ (Pushkar Singh Dhami) బుధవారం స్పందించారు. ఫాస్ట్-ట్రాక్ కోర్టు ద్వారా విచారణ పూర్తిచేసి దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు. అలాగే, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం సీఎం ధామీ (Uttarakhand CM) ప్రకటించారు. పౌరీ గర్వాల్ జిల్లా రిషికేశ్ సమీపంలో మాజీ మంత్రి కుమారుడు పులకిత్ ఆర్య నిర్వహిస్తోన్న రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోన్న అంకితా భండారీ.. గతవారం కనిపించకుండా పోయి కాల్వలో శవమైన తేలింది. అయితే, రిసార్ట్‌కు వచ్చే అతిథులకు ప్రత్యేక సేవలను నిరాకరించడంతో పులకిత్ ఆర్య (Pulkit Arya) మరో ఇద్దరితో కలిసి ఆమెను హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Samayam Telugu అంకిత హత్య కేసు నిందితులు


హత్య కేసు నమోదుచేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులను నాలుగు రోజుల కిందట అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అధికార పార్టీతో ఉన్న సంబంధాల కారణంగా పోలీసులు తాత్సారం చేస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఘటనపై రాజకీయ దుమారం రేగడంతో అధికార బీజేపీ (BJP) నష్టనివారణ చర్యలు చేపట్టింది. పులకిత్ ఆర్య తండ్రి వినోద్ అర్య, ఆయన సోదరుడు అంకిత ఆర్యలను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది.

ఇక, అంకిత హత్యోదంతం తర్వాత రిసార్ట్‌లోని దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రిసార్టులో డ్రగ్స్ వాడకం, విచ్చలవిడిగా మద్యం, వ్యభిచారం సర్వసాధారణమేనని మాజీ ఉద్యోగులు ఆరోపించారు. రిసార్ట్‌కు వచ్చే అతిథులకు అక్రమ మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలు సహా అమ్మాయిల్ని కూడా సరఫరా చేస్తారని అంకిత కంటే ముందు రిసెప్షనిస్ట్‌గా పనిచేసిన రిషిత, అక్కడ హౌస్‌‌కీపర్‌గా పనిచేసిన ఆమె భర్త వివేక్ వెల్లడించారు.

ఇక, ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే బుల్డోజర్లతో రిసార్టును నేలమట్టం చేశారు. అయితే, అది నిందితుడిని శిక్షించడం కోసం కాదనీ, రిసార్టులో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలనూ సమూలంగా నాశనం చేసి, అతడ్ని కాపాడటం కోసమని స్థానికులు, విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.