యాప్నగరం

కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు బాధించాయి: హజారే

ఆ ఉద్యమ ఫలితంగానే ఆయన డిల్లీలో అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు..

TNN 7 May 2017, 6:38 pm
డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఆప్ బహిష్కృత నేత కపిల్ మిశ్రా అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు, గతంలో కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన అన్నా హజారే స్పందించారు. ఆ ఆరోపణలు తనకు అత్యంత బాధ కలిగించాయని ఆయన అన్నారు. ‘అవినీతికి వ్యతిరేకంగా చేసిన మొట్టమొదటి ఉద్యమంలో ఆయన (కేజ్రీవాల్) నాతో కలసి పని చేశారు. ఆ ఉద్యమ ఫలితంగానే ఆయన డిల్లీలో అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు దీని గురించి నాకింకా పూర్తి వివరాలు తెలియవు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాతే కేజ్రీవాల్ తన పదవిలో కొనసాగాలా.. వద్దా అనే అంశంపై స్పందిస్తా’ అని అన్నా పేర్కొన్నారు.
Samayam Telugu anna hazare reacts on corruption allegations against arvind kejriwal
కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు బాధించాయి: హజారే


బీజేపీలో చేరబోతున్నాడనే సమాచారంతో శనివారం మంత్రి కపిల్ మిశ్రాపై కేజ్రీవాల్‌పై బహిష్కరణ వేటు వేయడంతో ఆప్ రాజకీయాలు మరోసారి వేడేక్కాయి. కేజ్రీవాల్ డబ్బు తీసుకుంటుండగా ప్రత్యక్షంగా చూశానని, సత్యేంద్ర జైన్ శుక్రవారం రూ. 2 కోట్లు ఆయనకు ఇచ్చారని కపిల్ మిశ్రా ఆరోపించారు. ఈ విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు కూడా ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా ఆయన.. ‘పదవి పోవడం పెద్ద లెక్క కాదు. ప్రాణ త్యాగానికైనా వెనుకాడను. పార్టీని వీడేది లేదు. ఆప్ నా పార్టీ. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో నేనూ ఒకడిని’ అంటూ వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.