యాప్నగరం

ఢిల్లీలో ఇక రెండు విమానాశ్రయాలు!

దేశ రాజధాని ఢిల్లీలో రెండో విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

TNN 24 Jun 2017, 7:18 pm
దేశ రాజధాని ఢిల్లీలో రెండో విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉంది. ఇక్కడ టెర్మినల్ 3లో అంతర్జాతీయ విమానాలు, టెర్మినల్ 1లో దేశీయ విమానాలు రాకపోకలు చేస్తున్నాయి.
Samayam Telugu another airport to come up soon near delhi as govt clears proposal for one in greater noida
ఢిల్లీలో ఇక రెండు విమానాశ్రయాలు!


ఇటీవల ఎయిర్ ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో ఢిల్లీకి చేరిన తర్వాత చాలా విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతూ ఆలస్యంగా దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో విమానాశ్రయం నెలకొల్పేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రస్తుత విమానాశ్రయం హర్యానా ఢిల్లీకి మధ్యలో గుర్గావ్‌లో ఉంది. రెండో విమానాశ్రయాన్ని గ్రేటర్ నొయిడాలో ఏర్పాటు చేయనున్నారు.

పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో రెండో విమానాశ్రయానికి ప్రాథమిక ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. విమానాశ్రయం కోసం యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ 3000 హెక్టార్ల స్థలం కేటాయించనుందని వెల్లడించారు.

ప్రపంచస్థాయి గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ నిర్మిస్తామని తెలిపారు. రానున్న 10 - 15 ఏళ్లలో నొయిడా విమానాశ్రయం ద్వారా 30-50 మిలియన్ ప్రయాణికులు రాకపోకలు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఢిల్లీలో 2020కి సుమారు 91 మిలియన్లు, 2024 నాటికి దాదాపు 109 మిలియన్ ప్రయాణికులు రాకపోకలు చేయవచ్చని అంచనా వేస్తున్నామని గజపతిరాజు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.