యాప్నగరం

ఆ యువకుడి గొంతు కోసి.. కశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం

కశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం. ఐదుగురు యువకులను అపహరించి ఒకరిని గొంతు కోశారు. మరో ఇద్దరి జాడ లేదు.

Samayam Telugu 18 Nov 2018, 12:47 am
శ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి ఒడిగట్టారు. 19 ఏళ్ల ఓ యువకుణ్ని అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడనే అనుమానంతో ఈ చర్యకు పాల్పడ్డారు. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు వ్యక్తులు శనివారం (నవంబర్ 17) ఉదయం కశ్మీర్‌లోని షోపియాన్ ప్రాంతం నుంచి ఐదుగురు యువకులను అపహరించారు. వారిలో ఇద్దరిని విడిచిపెట్టగా.. 19 ఏళ్ల హుజైఫ్ కుట్టాయ్‌ను గొంతు కోసి హతమార్చారు. మిగిలిన ఇద్దరు యువకులు సమాచారం తెలియాల్సి ఉంది.
Samayam Telugu kashmir


గురువారం రాత్రి 17 ఏళ్ల ఓ యువకుడిని అపహరించిన ఉగ్రవాదలు అతణ్ని అత్యంత దారుణంగా చంపేశారు. ఐసిస్ ఉగ్రవాదుల తరహాలో ఘాతుకానికి పాల్పడ్డారు. దానికి సంబంధించిన వీడియోను హిజ్బుల్ ముజాహిద్దీన్‌ విడుదల చేసింది. శనివారం ఆ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టింది. ఆ చర్యను నెటిజన్లు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఇంతలోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

కుట్టాయ్‌ హత్యను జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ‘మరో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సారి ఉగ్రవాదులు అతడి గొంతు కోశారు. ఇలాంటి అనాగరిక చర్యలకు సమాజంలో చోటులేదు. ఇలాంటి చర్యలు ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఈ అమానుష చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.