యాప్నగరం

స్టెరిలైట్ ఫ్యాకర్టీపై భగ్గుమన్న జనం.. రణరంగంగా తూత్తుకుడి

తమిళనాడులోని తూత్తుకుడిలో చేపట్టిన నిరసనర్యాలీ రణరంగంగా మారింది. పోలీసులు-జనాల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. పరిస్థితి లాఠీఛార్జీ వరకు వెళ్లి.. ఒకరి ప్రాణాలు పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

Samayam Telugu 22 May 2018, 3:14 pm
తమిళనాడులోని తూత్తుకుడిలో చేపట్టిన నిరసనర్యాలీ రణరంగంగా మారింది. పోలీసులు-జనాల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. పరిస్థితి లాఠీఛార్జీ వరకు వెళ్లి.. ఒకరి ప్రాణాలు పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. తూత్తుకుడి సమీపంలోని స్టెరిలైట్ ఫ్యాకర్టీకి వ్యతిరేకంగా స్థానికులు నిరసనకు పిలుపునిచ్చారు. దీనికి అనుమతి లేదని.. 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు పోలీసులు. ఒకవేళ ఆందోళన తెలపాలనుకుంటే.. ఓల్డ్ బస్టాండ్‌ సమీపంలోని గ్రౌండ్‌లో చేసుకోవచ్చని చెప్పారు. అప్పటికే స్థానికులు షాపులన్నీ మూసేసి స్వచ్చంధంగా బంద్ కూడా పాటించారు.
Samayam Telugu Tuticorn-2




స్థానికంగా నిరసన జరుగుతుండటంతో.. కార్మిక సంఘాలు, స్థానికులు కలెక్టరేట్ దగ్గరకు వచ్చారు. ఈలోపు కొంతమంది ర్యాలీగా బయల్దేరి.. లోపలికి వెళ్లేందుకు దూసుకొచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని చెదరగొట్టారు. దీంతో మరింత రెచ్చిపోయిన నిరసనకారులు.. కలెక్టరేట్‌కు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీఛార్జ్ చేయడంతో జనాలు రాళ్లు విసిరారు. ఈ ఘర్షణలో ఒకరు చనిపోగా.. 20మందికిపైగా గాయపడ్డారు. బాధితుల్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ముందస్తు జాగ్రత్తగా అక్కడ బలగాలను మోహరించారు.



1996లో వేదాంత లిమిటెడ్ తూత్తుకుడి సమీపంలో స్టెరిలైడ్ రాగి కర్మాగారాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీతో తామ ఆరోగ్యపరమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తున్నారు. దీన్ని వెంటనే మూసివేయాలంటూ తరచూ ఆందోళనలకు దిగుతూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇవాళ కూడా అక్కడ రణరంగాన్ని తలపించింది.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.