యాప్నగరం

బెంగళూరులో బాబు.. మమత, మాయతో కీలక చర్చలు

ప్రాంతీయ పార్టీలు మళ్లీ ఒక్కటవుతున్నాయా.. జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా పోరుకు సిద్ధమవుతున్నాయా.. అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కర్ణాటకలో పరిణామాల తర్వాత.. ఈ రాజకీయ పరిస్థితులు మారిపోతున్నట్లే కనిపిస్తోంది.

Samayam Telugu 23 May 2018, 3:01 pm
ప్రాంతీయ పార్టీలు మళ్లీ ఒక్కటవుతున్నాయా.. జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా పోరుకు సిద్ధమవుతున్నాయా.. అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కర్ణాటకలో పరిణామాల తర్వాత.. ఈ రాజకీయ పరిస్థితులు మారిపోతున్నట్లే కనిపిస్తోంది. మొన్నటి వరకు ఎడ మొహం పెడ మొహంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నట్లే ఉంది. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ కుమార స్వామి ప్రమాణ స్వీకారం కోసం వచ్చిన ప్రాంతీయ పార్టీల నేతలు, సీఎంలు వరుస భేటీలు చర్చనీయాంశంగా మారాయి.
Samayam Telugu Babu


కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఏపీ సీఎం చంద్రబాబు.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. యూపీ బీఎస్పీ అధినేత్రి మాయవతి బెంగళూరు వచ్చారు. ఈ సందర్భంలో చంద్రబాబు మమత, మాయావతిలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఈ వరుస సమావేశాల్లో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా తాజా రాజకీయాలు, ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, జీఎస్టీ, నగదు కొరతపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ విషయంలో కేంద్రం చేసిన అన్యాయాన్ని బాబు వారికి వివరించినట్లు సమాచారం.

అంతకముందు కూడా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్‌లో జేడీఎస్‌తోనూ కలిసి పనిచేసే అవకాశం ఉందని ఆయన చెప్పడం విశేషం. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని కూడా పిలుపునిచ్చారు. ఈ పరిణామాలు, బాబు వ్యాఖ్యలు చూస్తే పాంత్రీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయనే చెప్పాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.