యాప్నగరం

Urjit Patel రాజీనామా దురదృష్టకరం: చంద్రబాబు

2016లో ఆర్బీఐ గవర్నర్ పదవిని చేపట్టిన ఉర్జిత్ పటేల్ మూడేళ్లపాటు పదవిలో కొనసాగాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఉర్జిత్ తన పదవి నుంచి తప్పుకున్నారు.

Samayam Telugu 11 Dec 2018, 6:09 am
ఆర్బీఐ గవర్నర్‌ పదవికి ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఉర్జిత్ రాజీనామా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థల గౌరవ ప్రతిష్ఠల్ని దిగజార్చిందని మండిపడ్డారు. నేడు ఢిల్లీలో బీజేపీయేతర కూటమి ఏర్పాటు దిశగా 14 పార్టీలు పాల్గొన్న సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.
Samayam Telugu Chandrababu Naidu


ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఉర్జిత్‌ రాజీనామాపై స్పందించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో దేశంలో ఎంతో కీలకమైన సీబీఐ విభాగంతో పాటు ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతిష్ఠ మసకబారిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు. ఉర్జిత్ పటేల్ రాజీనామానే ఇందుకు నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు.

కాగా, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. దీని వెనుక కారణాలు ఏమైనప్పటికీ.. తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఉర్జిత్ వెల్లడించారు. 2016లో ఆర్బీఐ గవర్నర్ పదవిని చేపట్టిన ఉర్జిత్ పటేల్ మూడేళ్లపాటు పదవిలో కొనసాగాల్సి ఉంది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌తో పదవీకాలం ముగియనున్నా.. అంతకుముందే ఉర్జిత్ అనుహ్య నిర్ణయం తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.