యాప్నగరం

Shirdi Saibaba Temple: షిరిడీ సాయికి రూ.36.98 లక్షల విలువజేసే బంగారు కిరీటం

ఆంధ్రప్రదేశ్‌కు (Shirdi Saibaba Temple) చెందిన వ్యక్తి షిరిడీ సాయిబాబాకు బంగారు కిరీటాన్ని విరాళంగా అందజేశారు. రూ.36.98 లక్షల విలువజేసే కిరిటాన్ని, వెండి పళ్లాన్ని కూడా అందజేశారు. ఏపీ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ప్రభాకర్‌ 770 గ్రాముల బంగారు కిరీటం, 620 గ్రాముల వెండి కంచాన్ని గురువారం సాయిబాబాకు అందజేసినట్టు ఆయన నిర్వాహకులు చెప్పారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 12 Aug 2022, 8:48 pm
మహారాష్ట్రలోని షిరిడీ పట్టణంలోని (Shirdi Saibaba Temple) ప్రసిద్ధ సాయిబాబా ఆలయానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 57 ఏళ్ల వ్యక్తి రూ.36.98 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని విరాళంగా అందజేశారు. దాంతోపాటు రూ.33,000 విలువ చేసే వెండి పళ్లెంను అందజేశారు. ఈ విషయాన్ని దేవస్థాన నిర్వాహకులు శుక్రవారం తెలిపింది.
Samayam Telugu Shirdi Saibaba


ఏపీ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ప్రభాకర్‌ 770 గ్రాముల బంగారు కిరీటం, 620 గ్రాముల వెండి కంచాన్ని రక్షా బంధన్ పవిత్రమైన రోజైన గురువారం సాయిబాబాకు అందజేసినట్టు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాగ్యశ్రీ బనాయత్ వెల్లడించారు. షిరిడీ సాయి సంస్థాన్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి భాగ్య శ్రీ బనాయత్‌కు ఈ కానుకలను అందజేశారు. ఆ సమయంలో అన్నం సతీశ్ ప్రభాకర్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

కాగా గత నెలలో హైదరాబాద్‌కు చెందిన 80 ఏళ్ల వైద్యుడు రూ.33 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని ఆలయ ట్రస్టుకు విరాళంగా అందజేశారు. 707 గ్రాముల బరువున్న ఆ కిరీటంపై 35 గ్రాముల అమెరికన్ వజ్రాలను పొదిగారు. చూడ్డానికి ఎంత ఆకర్షనీయంగా ఉండేలా తయారు చేయించారు. 1992లో తన భార్యతో కలసి షిరిడికి వెళ్లిన ఆయన బాబాకు కిరీటం ఇవ్వాలనుకున్నారు. దురదృష్టవశాత్తూ మంద రామకృష్ణ భార్య కొన్నాళ్ల క్రితం చనిపోవడంతో కిరీటం అందజేసే సమయంలో ఆమె లేరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.