ఏమైనా సమస్యలు ఉండి ఉంటే.. తనకే నేరుగా ఫిర్యాదు చేయాలని, వీడియోల ద్వారా తమ బాధలను వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ఆర్మీ చీఫ్ బిపిన్ చంద్ర రావత్ వెల్లడించారు. ఈ మేరకు ప్రతి ఆర్మీ హెడ్ క్వార్టర్లో కంప్లయింట్ బాక్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా సైనికులు తమ సమస్యలను నేరుగా తనకు విన్నివించుకోవచ్చని పేర్కొన్నారు. ఆ ఫిర్యాదులన్నీ తానే స్వయంగా చదువుతానని వెల్లడించారు.
కొద్ది రోజుల కిందట బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ జవాన్ల నుంచి పలు సమస్యలు బయటకు వచ్చాయి. తాజాగా ఓ సైనికుడు తీసిన వీడియో సైన్యంలో హల్చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సైనికులు సోషల్ మీడియాలో అటువంటి ఫిర్యాదులు పెట్టకుండా నేరుగా ఆర్మీ చీఫ్కే ఫిర్యాదులు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
కొద్ది రోజుల కిందట బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ జవాన్ల నుంచి పలు సమస్యలు బయటకు వచ్చాయి. తాజాగా ఓ సైనికుడు తీసిన వీడియో సైన్యంలో హల్చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సైనికులు సోషల్ మీడియాలో అటువంటి ఫిర్యాదులు పెట్టకుండా నేరుగా ఆర్మీ చీఫ్కే ఫిర్యాదులు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.