యాప్నగరం

శవపేటిక, జాతీయ జెండాతో వస్తానని చెప్పాలా

గతనెల 9న తమపైకి రాళ్లు రువ్వుతున్న వారి నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తిని కారుపై కట్టేసిన సంఘటన

TNN 28 May 2017, 5:17 pm
గతనెల 9న తమపైకి రాళ్లు రువ్వుతున్న వారి నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తిని కారుపై కట్టేసిన సంఘటన (హ్యుమన్ షీల్డ్)ను ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సమర్ధించారు. జమ్మూకశ్మీర్ లో డర్టీ వార్ కొనసాగుతోందని దుయ్యబట్టారు. కశ్మీర్ యువకులు తమపై రాళ్లు రువ్వేకంటే ఆయుధాలతో దాడి చేసి ఉంటే తాము ఎదుర్కోనేవాళ్లమని ఆయన అన్నారు. తమ సైన్యాన్ని కాపాడుకునేందుకు తాము అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
Samayam Telugu army chief bipin rawat defends human shield incident in kashmir
శవపేటిక, జాతీయ జెండాతో వస్తానని చెప్పాలా


‘ఇదో డర్టీ వార్. మీరు మీకు తోచిన దారిలో పయనిస్తే మేం కూడా కొత్తపంథాలో వెళ్తాం. ప్రజలు మాపై రాళ్లు రువ్వుతున్నారు. పెట్రోలు బాంబులు విసురుతున్నారు. అలాంటి సమయంలో మా సైనికులు ‘ఏం చేయాలి సర్’ అని అడిగితే వాళ్లకు.. జస్ట్ వెయిట్ అండ్ డై (ఆగండి, చావండి) అని చెప్పాలా? నేను మంచి శవపేటిక, జాతీయ జెండాతో వచ్చి మీ శవాలను అధికార లాంఛనాలతో పంపిస్తా అని చెప్పాలా? నేను సైనికుల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి. వాళ్లకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది’ అని బిపిన్ రావత్ స్పష్టం చేశారు.


ఏప్రిల్ 9న కశ్మీర్ లో ఆర్మీపై రాళ్లు రువ్వాడని ఫరూఖ్ దార్ అనే వ్యక్తిని తమ జీపు పై భాగంలో కట్టేసి ఊరేగించిన మేజర్ గోగొయ్ కు పురస్కారం సైతం వచ్చింది. ఈ సందర్భంగా రావత్ పీటీఐకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.