యాప్నగరం

చైనా, పాక్‌ల‌తో యుద్ధానికి సిద్ధం: ఆర్మీ చీఫ్

సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోడానికైనా సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు.

TNN 8 Jun 2017, 12:13 pm
ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోడానికైనా సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లో అలజడికి పాకిస్థానే కారణమని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ద్వారా, కశ్మీరీ యువతను పాక్ రెచ్చగొడుతోందని రావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో పరిస్థితులు త్వరలోనే చక్కబడి, ప్రశాంతత నెలకుంటుందని అన్నారు. పాకిస్థాన్, చైనా‌తోపాటు కశ్మీర్ పరిస్థితుల గురించి రావత్ మాట్లాడుతూ రెండున్నర యుద్ధాలను ఎదుర్కోడానికి ఆర్మీ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.
Samayam Telugu army chief says india fully ready for two and a half front war
చైనా, పాక్‌ల‌తో యుద్ధానికి సిద్ధం: ఆర్మీ చీఫ్


ఆర్మీ ఆధునికీకరణకు సంబంధించిన పురోగతి బాగుందని తెలిపారు. ఈ విషయంలో సమతూకం పాటిస్తున్నామని అన్నారు. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌లోకి చొరబడుతున్న ముష్కరులపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. ఈ రోజు ఉదయం కూడా దేశంలోకి చోరబాట్లకు ప్రయత్నించిన ఇద్దరు తీవ్రవాదులు సైన్యం హతమార్చిందని, ఈ ఘటనలో ఓ జవాన్‌కు ప్రాణాలు కోల్పోయాడని తెలియజేశారు. చైనాతో వివాదాలు గురించి కూడా రావత్ ప్రస్తావించారు. భారత్, చైనా సరిహద్దుల్లో గత 40 ఏళ్లుగా ఒక్క బుల్లెట్‌కు వాడలేదని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేశారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.