యాప్నగరం

AIIMS: రాష్ట్రపతి కోవింద్ కుమారుడికి ప్రధాని ఫోన్.. ఆరోగ్యం గురించి ఆరా

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరనున్నారు. ఛాతీలో అసౌకర్యం కారణంగా ఆయన ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. రాష్ట్రపతి ఆరోగ్యం గురించి మోదీ ఆరా తీశారు.

Samayam Telugu 27 Mar 2021, 3:35 pm
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌‌ను ఎయిమ్స్ హాస్పిటల్‌కు రెఫర్ చేశారు. తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం రాష్ట్రపతిని ఎయిమ్స్‌కు పంపించనున్నట్లు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌‌ రెఫరల్‌ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఛాతీలో అసౌకర్యం కారణంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అబ్జర్వేషన్‌లో ఉంచారు.
Samayam Telugu రామ్‌నాథ్ కోవింద్
Ram Nath Kovind


రాష్ట్రపతి ఆరోగ్యంపై శనివారం ఉదయం ఆర్మీ హాస్పిటల్ బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. మరోవైపు.. బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. రాష్ట్రపతి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కోవింద్‌ కుమారుడితో ఫోన్‌లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆర్మీ ఆసుపత్రికి వెళ్లి రాష్ట్రపతిని పరామర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.