యాప్నగరం

సరిహద్దుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ ఆర్మీ జవాన్

ఇటీవల వరుసగా సైనికులు ఆత్మహత్యకు పాల్పడటంతో సైన్యంలో ఏం జరుగుతోందనే అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ బలపడుతున్నాయి. తాజాగా కశ్మీర్ సరిహద్దుల్లో ఓ సైనికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

TNN 3 May 2017, 12:23 pm
ఇటీవల వరుసగా సైనికులు ఆత్మహత్యకు పాల్పడటంతో సైన్యంలో ఏం జరుగుతోందనే అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ బలపడుతున్నాయి. తాజాగా కశ్మీర్ సరిహద్దుల్లో ఓ సైనికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్మూ కశ్మీర్‌ రజౌరీ జిల్లా లామ్ సెక్టార్‌లో విధులు నిర్వహిస్తోన్న ఆర్మీ జవాన్ సర్వీస్ ఈ రోజు ఉదయం రివాల్వర్‌తో కాల్చుకుని అత్యహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 54 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన లాన్స్ నాయక్ విశాల్ లోహర్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడంపై ఆర్మీ స్పందించింది. దీనిపై కోర్టు ద్వారా విచారణకు ఆదేశించింది. కర్ణాటకకు చెందిన 33 ఏళ్ల విశాల్ లోహర్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
Samayam Telugu army jawan commits suicide in rajouri along loc
సరిహద్దుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ ఆర్మీ జవాన్


సైనికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన వీడియో వైరల్ కావడంతో జవాన్ రాయ్ మాథ్యూ అనే వ్యక్తి గత మార్చిన 4 న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలో డియోలలి కంటోన్మెంట్‌లోని బారాక్ ఆత్మహత్యకు పాల్పడ్డ జవాన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన మాథ్యూ బ్రిటీష్ కాలం నాటి ఆర్డర్లీ విధానంపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి ఉన్నతాధికారుల ఇంటికి సంబంధించిన పనులు చేస్తూ జవాన్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఇది అప్పట్లో వైరల్ కావడంతో మాథ్యూపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.