యాప్నగరం

పాక్ మూకకు బుద్ధిచెప్పిన భారత సైన్యం

జంద్రోత్ - కోట్లీ ప్రాంతంలో భారత సైనిక శిబిరాలపై పాక్ సైన్యం భారీ మోర్టార్లతో దాడిచేసింది. ప్రతిదాడిలో భారత్ జరిపిన కాల్పుల్లో పాక్ మేజర్‌తో పాటు నలుగురు సైనికులు చనిపోయారు.

TNN 16 Jan 2018, 11:48 am
గ్రవాదులను దేశంలోకి చొరబడేందుకు సహకరిస్తున్న పాకిస్తాన్ సైన్యానికి భారత్ గట్టిగా గుణపాఠం చెప్పింది. సోమవారం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతూ భారత సైనిక శిబిరాలపై దాడి చేసిన పాకిస్తాన్ సైన్యం మూల్యం చెల్లించుకోక తప్పలేదు. భారత సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు పాకిస్తాన్ సైనికులు మరణించారు.
Samayam Telugu army kills four pak soldiers five jaish e muhammed terrorists
పాక్ మూకకు బుద్ధిచెప్పిన భారత సైన్యం


ఉగ్రవాదులను సరిహద్దులు దాటించేందుకు పాక్ ఇలాంటి కవ్వింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ ఉగ్రవాదులకు సహకరించే ప్రయత్నిస్తే.. పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి బదులిస్తామని హెచ్చరించారు.

జంద్రోత్ -కోట్లీ ప్రాంతంలో భారత సైనిక శిబిరాలపై పాక్ సైన్యం భారీ మోర్టార్లతో దాడిచేసింది. ప్రతిదాడిలో భారత్ జరిపిన కాల్పుల్లో పాక్ మేజర్‌తో పాటు నలుగురు సైనికులు చనిపోయారు. అయితే, సరిహద్దు వెంట లైన్ కమ్యునికేషన్ మెయింటెన్స్ చేస్తున్న తమ సైనికులపై భారత సైన్యం కాల్పులు జరిపిందని పాక్ కపట నాటకానికి తెర లేపింది.

ఈ కాల్పుల్లో వాస్తవానికి ఏడుగురు పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే, పాక్ మాత్రం నలుగురే చనిపోయారని, తమ ఎదురు కాల్పుల్లో భారత సైనికులు కూడా చనిపోయారని పేర్కొంది. అయితే, ఈ ఘటనలో సైనికులెవరూ చనిపోలేనది భారత్ స్పష్టం చేసింది.

ఐదుగురు ఉగ్రవాదులు హతం: ఆర్మీడే రోజున (జనవరి 15) భారత సైన్యం మరో ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చింది. ఉరీ సెక్టార్‌లో భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తున్న జైష్-ఇ-మహ్మద్(JeM) ఉగ్రవాదులు సైన్యం కాల్పుల్లో మరణించారు. ఆర్మీడేను భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు ఆదివారం రాత్రి నుంచి భారత సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. బోటులో జెలూం నది దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భారత సైన్యం కాల్పులు జరిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.