యాప్నగరం

ఆర్మీ చ‌ర్య‌ల వ‌ల్లే పౌరులే ఎక్కువ‌ మ‌ర‌ణిస్తున్నారు: ఆజాద్‌

భార‌త సైన్యం గురించి కాంగ్రెస్ మాజీ మంత్రి, జ‌మ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఆజాద్ వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

Samayam Telugu 21 Jun 2018, 10:14 am
భార‌త సైన్యం గురించి కాంగ్రెస్ మాజీ మంత్రి, జ‌మ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఆజాద్ వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. జమ్ము కాశ్మీర్‌లో సైన్యం చేపట్టిన చర్యల వల్ల ఉగ్రవాదులకంటే పౌరులే ఎక్కువ మంది మరణించారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, జమ్ము కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. బీజేపీ ”ఆల్‌ అవుట్‌ ఆపరేషన్స్‌” అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ రాష్ట్రంలో సామూహిక హత్యాకాండకు బీజేపీ ప్రణాళిక రచిస్తున్నట్లు సూచిస్తున్నాయని ఆజాద్‌ ఆరోపించారు. కాగా ఆజాద్‌ చేసిన ఆరోపణలు సైన్యం మనోధైర్యాన్ని దెబ్బ తీసే విధంగా ఉన్నాయని బీజేపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.
Samayam Telugu Gulam Nabi Azad
గులాం నబీ ఆజాద్

Indian army jawan during a search operation outside the army camp in Jammu on Tuesday. Security forces today launched a massive search operation after Army personnel foiled a suspected terrorist attack on their camp.Photo


''వాళ్లు(సైన్యం) చ‌ర్య తీసుకోవ‌డం వ‌ల్ల న‌లుగురు ఉగ్ర‌వాదులు మ‌రణిస్తున్నారు. అదే స‌మ‌యంలో 20 మంది పౌరులు చ‌నిపోతున్నారు. అంటే వారి చ‌ర్య ఉగ్ర‌వాదుల‌పై కంటే పౌరుల‌పై ఎక్కువ ప‌నిచేస్తోంది. ఉదాహర‌ణ‌కు పుల్వామా ప్రాంతంలో ఒక ఉగ్ర‌వాదిని చంపే ప్ర‌య‌త్నంలో 13 మంది పౌరులు మ‌ర‌ణించారు"అని ఆజాద్ ఒక టీవీ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.
ఆజాద్ చేసిన వ్యాఖ్య‌ల‌కు భాజ‌పా నేత‌లు తీవ్రంగా స్పందిస్తున్నారు. "ఆజాద్ లాంటి నేత‌ల‌పై రాహుల్ గాంధీ యాక్ష‌న్ తీసుకోవాలి. ఆర్మీపై ఆయ‌న నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు కావాల‌నుకుంటే బీజేపీ నేత‌ల‌ను విమ‌ర్శించ‌వ‌చ్చు కానీ సైన్యంపైన ఎలాంటి తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌దు," అని బీజేపీ నేష‌న‌ల్ మీడియా ఛీప్ అనిల్ బ‌లూనీ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.