యాప్నగరం

అర్ణబ్‌‌కు హైకోర్టు షాక్.. బెయిల్ పిటీషన్‌ తిరస్కరణ

అర్ణబ్‌కు బెయిల్ పిటీషన్‌ను కోర్టు తిరస్కరించింది. కేసులో ప్రతివాదులుగా ఉన్న వారి వాదనలు వినిపించాల్సిందిగా కోరుతూ విచారణను వాయిదా వేసింది.

Samayam Telugu 6 Nov 2020, 8:20 am
రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన బెయిల్ మీద విడుదల అవుతారు అనికున్నారు. కానీ బాంబే హైకోర్టులో అర్నాబ్ బెయిల్ పిటీషన్ కు చుక్కెదురైంది. తన అరెస్ట్ అక్రమమని, తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఈ నెల 18 వరకు అర్నాబ్ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
Samayam Telugu అర్ణబ్ గోస్వామి


అర్నాబ్ తరపు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టులో తన వాదనలు వినిపిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అర్నాబ్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అయితే వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం, ఆత్మహత్య చేసుకున్న అన్వయ్ నాయక్ భార్య అక్షతలను తమ వాదనలు వినిపించాల్సిందిగా కోరుతూ వాయిదా వేసింది. ఆర్కిటెక్చర్-ఇంటీరియర్ డిజైనర్ అయిన అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదిని ఆత్మహత్య కేసును బాధిత కుటుంబం అభ్యర్థనపై మహారాష్ట్ర ప్రభుత్వం మూసివేసిన కేసును రీఓపెన్ చేసింది.

Read More: అర్నాబ్ గోస్వామి: రాత్రంతా ఆ స్కూల్లోనే.. మరో 14 రోజులు అక్కడే!

దీంతో అర్నాబ్ గోస్వామి, ఫిరోజ్ షేక్, నితేశ్ సర్దాలను అరెస్ట్ చేసి అలీబాగ్ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే అర్నాబ్‌ను పోలీసు కస్టడీకి అప్పగించాలంటూ చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి మాత్రమేత అనుమతించింది. ప్రస్తుతం అర్ణబ్ గోస్వామి అలీబాగ్ జైలు కోసం ఏర్పాటు చేసిన ఓ కొవిడ్ కేంద్రంలో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.