యాప్నగరం

గణపతి ఉత్సవాల్లో విషాదం: డ్యాన్స్ చేస్తూ స్టేజ్‌పైనే కుప్పకూలిపోయిన ఆర్టిస్ట్

డ్యాన్స్ చేస్తుండగా వేదికపైనే గుండెపోటుకు గురైన ఆర్టిస్ట్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. గణపతి నవరాత్రుల్లో కల్చరల్ నిర్వహించిన సమయంలో ఈ ఘటన జరిగింది. బుధవారం రాత్రి జమ్మూలోని ఓ గ్రామంలో శివపార్వతుల గురించి ప్రదర్శన జరుగుతుండగా.. పార్వతి వేషంలో ఉన్న యువకుడు ఉన్నట్టుండి వేదికపై పడిపోయారు. అయితే, ఇది కూడా ప్రదర్శనలో భాగమని ప్రేక్షకులు కాసేపు పట్టించుకోలేదు. చివరకు తోటి ఆర్టిస్ట్ దీనిని గమనించి వెంటనే అతడ్ని లేపడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 8 Sep 2022, 3:23 pm
నృత్యప్రదర్శన విషాదంగా మారింది. వేదికపై నృత్యం చేస్తుండగా ఓ కళాకారుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. నృత్యం చేస్తూ గుండెపోటుతో వేదికపైనే కూలబడిపోవడంతో ప్రదర్శనలో భాగంగానే ప్రేక్షకులు భావించారు. కొద్ది నిమిషాల వరకూ ఎవరూ స్పందించలేదు. కొద్ది సేపటి తర్వాత శివుడి వేషధారణలో ఉన్న మరో ఆర్టిస్ట్ వేదికపైకి వెళ్లి చూడగా స్పందన లేకుండా పడి ఉన్నాడు. దీంతో పైకి లేపడానికి ప్రయత్నించాడు. స్పృహ‌తప్పిపోవడంతో వెంటనే అక్కడ ఉన్నవాళ్లు చేరుకుని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. విషాదకర ఈ ఘటన జమ్మూలో చోటుచేసుకుంది.
Samayam Telugu విషాదం మిగిల్చిన ప్రదర్శన


ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జమ్మూలోని బిష్ణా ప్రాంతం కోథే గ్రామంలోని వినాయక మండపం వద్ద బుధవారం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా శివపార్వతుల నృత్య ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. పార్వతి వేషధారణలో ఉన్న యోగేశ్ గుప్తా అనే 20 ఏళ్ల కళాకారుడు.. సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తున్నాడు. నృత్యాన్ని తిలకిస్తూ ప్రేక్షకులు ప్రదర్శనలో లీనమైపోయారు. కొద్ది సేపటి తర్వాత ఉన్నట్టుండి వేదికపై కుప్పకూలిపోయాడు.


అయితే, అక్కడ ఉన్నవారంతా ఇది కూడా ప్రదర్శనలో భాగమని భావించారు. అయితే, శివుడి వేషధారణలో ఉన్న మరో కళకారుడు గమనించి వెంటనే యోగేశ్ వద్దకు వెళ్లి లేపే ప్రయత్నం చేయగా అప్పటికే స్పృహ‌ కోల్పోవడం అచేతనంగా ఉన్నాడు. వెంటనే పక్కన ఉన్నవారి సాయంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. యోగేశ్‌ను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్టు ధ్రువీకరించారు. గుండెపోటుకు గురైనట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.

కాగా, ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు దేశంలో పలు చోటుచేసుకుంటున్నాయి. గత జూన్‌లో సింగర్ కేకే కలకత్తాలో ప్రదర్శన కోసం రిహార్సిల్స్ చేస్తుండగా కార్డియాక్ అరెస్ట్‌కు గురై చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మే 28న ప్రముఖ మలయాళ గాయకుడు ఈద్వా బషీర్ కూడా అలప్పూజలో సంగీత కచేరీ చేస్తుండగానే గుండెపోటుతో కన్నుమూశారు.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.