యాప్నగరం

అపోలో హాస్పిటల్‌కు అమిత్ షా, జైట్లీ!

జయలలితను పరామర్శించేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెన్నై వచ్చారు.

TNN 12 Oct 2016, 6:05 pm
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెన్నై వచ్చారు. వారిద్దరూ జయ చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. ఓ 20 నిమిషాలు ఆసుపత్రిలోనే ఉండి అనంతరం వెనుదిరిగారు. వారికి కూడా జయ ఉన్న గదిలోకి అనుమతి లభించలేదు. మీడియాతో ఏం మాట్లాడకుండా ఇద్దరు వెళ్లిపోయారు. అనంతరం ట్విట్టర్ ద్వారా జయ లలిత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ట్వీటు చేశారు. జయలలిత గత 20 రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
Samayam Telugu arun jaitley amit shah visited apollo hospitals
అపోలో హాస్పిటల్‌కు అమిత్ షా, జైట్లీ!

Visited Apollo hospital Chennai today. I wish J Jayalalithaa Ji, Chief Minister of Tamil Nadu a speedy recovery. — Arun Jaitley (@arunjaitley) October 12, 2016 Visited Apollo Hospital in Chennai to enquire about the health of Tamil Nadu CM J Jayalalithaa Ji. I wish and pray for her speedy recovery. — Amit Shah (@AmitShah) October 12, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.