యాప్నగరం

86 శాతం నోట్ల మార్పిడి జరిగింది - జైట్లీ

ఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు బ్యాంకర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

TNN 12 Nov 2016, 3:59 pm
ఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య జనాలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు బ్యాంకర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నోట్ల మార్పిడి ప్రక్రియపై ఆయన సమీక్షించారు. జనాల అవసరాలు తీర్చేలా బ్యాంకులు పనిచేయాలని జైట్లీ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నోట్ల మార్పిడి సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి బ్యాంకర్లకు వివరించారు.
Samayam Telugu arun jaitley held an emergency meeting with bankers
86 శాతం నోట్ల మార్పిడి జరిగింది - జైట్లీ


సమీక్ష సమావేశం అనంతరం జేైట్లీ మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయానికి ప్రజల మద్దతు లభిస్తోందన్నారు. నోట్ల మార్పిడి ప్రారంభమై మూడు రోజులైంది..పాత నోట్లు మార్చేందుకు జనాలు భారీగా తరలివస్తున్నారని తెలిపారు. ఈ మూడు రోజుల్లో 86 శాతం నోట్ల మార్పిడి జరిగిందని.. మిలిగిన ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీ వెల్లడించారు.


దేశంలో చిల్లర కొరత లేకుండా అన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నామని జైట్లీ వెల్లడించారు. జనాల అవసరాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నామని జైట్లీ వివరించారు. తాజా నిర్ణయంతో బ్యాంకుల్లో వేల కోట్ల లావాదేవీలు జరుగున్నాయని ..ఈ మూడు రోజుల్లో దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐలో 47,868 కోట్ల డిపాజిట్లు జమా అయ్యాయని ఆర్ధిక మంత్రి జైట్లీ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.