నల్లధనంపై పోరాటాన్ని మరింత పటిష్టం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం మరో అంకానికి అంకురార్పణ చేసింది. అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ (మే 16) ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాయతీగా టాక్స్ చెల్లించేవారికి ఈ వెబ్సైట్ తోడ్పాడు అందిస్తుందని పేర్కొన్నారు. టాక్స్లను చెల్లించకుండా డబ్బును అక్రమంగా పక్కదారి పట్టించాలని చూసేవారి పప్పులు ఉడకవని ఆయన హెచ్చరించారు. అలాంటి వారిని ఇక ఎంత మాత్రం ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. నోట్ల రద్దు తదనంతర పరిణామాల తర్వాత డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నాయని జైట్లీ తెలిపారు. ఇదే సమయంలో కొంత మంది బ్యాంక్ ఖాతాల్లో అనూహ్యంగా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి పడిందని, అలాంటి అకౌంట్లన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన చెప్పారు.
డిమానిటైజేషన్ తర్వాత రూ. 16,398 కోట్ల అక్రమ ధనాన్ని గుర్తించినట్లు ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్’ చైర్మన్ తెలిపారు. నోట్ల రద్దు తర్వాత 30 కోట్ల మందికి పాన్ కార్డులు జారీ చేశామని, కొత్తగా 91 లక్షల మంది టాక్స్ పరిధిలోకి వచ్చారని ఆయన తెలిపారు.
డిమానిటైజేషన్ తర్వాత రూ. 16,398 కోట్ల అక్రమ ధనాన్ని గుర్తించినట్లు ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్’ చైర్మన్ తెలిపారు. నోట్ల రద్దు తర్వాత 30 కోట్ల మందికి పాన్ కార్డులు జారీ చేశామని, కొత్తగా 91 లక్షల మంది టాక్స్ పరిధిలోకి వచ్చారని ఆయన తెలిపారు.