యాప్నగరం

ఎంపీల ఆందోళనపై స్పందించిన కేంద్రం

ఉభయ సభల్లో ఏపీ ఎంపీలు వ్యక్తం చేస్తున్న నిరసన పట్ల స్పందించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి

TNN 6 Feb 2018, 4:16 pm
ఉభయ సభల్లో ఏపీ ఎంపీలు వ్యక్తం చేస్తున్న నిరసన పట్ల స్పందించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. బడ్జెట్ లో ఏపీకి తీవ్రమైన అన్యాయం జరిగిందని.. ఏపీ అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీకి న్యాయం చేయాలని.. విభజన హామీలను నిలబెట్టుకోవాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. అటు బీజేపీతో అధికార భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా నిరసన వ్యక్తం చేస్తుండే సరికి.. జైట్లీ స్పందించారు.
Samayam Telugu arun jaitley reacts on ap mps protest
ఎంపీల ఆందోళనపై స్పందించిన కేంద్రం


‘ఏపీ పునర్విభజన బిల్లు లోని అంశాలకు కట్టుబడి ఉన్నాం. ఆ హామీలన్నింటినీ నెరవేరుస్తాం..’ అని వ్యాఖ్యానించారు అరుణ్ జైట్లీ. ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శిని తక్షణం పిలిపించుకుని మాట్లాడతామని జైట్లీ ప్రకటించారు. ఏపీకి దక్కాల్సిన నిధుల గురించి ఆయనతో చర్చిస్తామని వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని మరోసారి స్పష్టం చేశారు జైట్లీ. హోదా సాధ్యం కాదనే.. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని, దాంట్లో దక్కాల్సిన నిధుల గురించి ఆర్థిక శాఖ కార్యదర్శితో చర్చిస్తామన్నారు.

ఇక రైల్వే జోన్ అంశం గురించి మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. రైల్వే జోన్ విషయంలో ఏపీ సరిహద్దు రాష్ట్రాలతో చర్చించాలని గోయల్ అన్నారు. ఈ విషయంలో సానుకూల స్పందన కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.