యాప్నగరం

ఢిల్లీ ఎయిమ్స్‌లో జైట్లీ..కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతమయ్యింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు మీడియాకు తెలిపారు. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశామని... జైట్లీతో కిడ్నీ ఇచ్చిన దాత ఆరోగ్యం మెరుగ్గానే ఉందని... వారిద్దరు త్వరగానే కోలుకుంటున్నారని చెప్పారు.

Samayam Telugu 14 May 2018, 3:08 pm
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతమయ్యింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు మీడియాకు తెలిపారు. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశామని... జైట్లీతో కిడ్నీ ఇచ్చిన దాత ఆరోగ్యం మెరుగ్గానే ఉందని... వారిద్దరు త్వరగానే కోలుకుంటున్నారని చెప్పారు. అరుణ్ జైట్లీకి ఆపరేషన్ చేసిన వైద్యుల బృందంలో అపోలో ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సందీప్ గులేరియా ఉన్నారు. ఈయన ఎయిమ్స్ డైరెక్టర్ రత్నదీప్ గులేరియాకు సోదరుడు. ఎయిమ్స్ డైరెక్టర్ రత్నదీప్ జైట్లీ కుటుంబానికి సన్నిహితుడు కావడంతో... ఆయన సోదరుడు సందీప్ గులేరియా జైట్లీకి చికిత్స చేసినట్లు తెలుస్తోంది.
Samayam Telugu Jaitely.


వాస్తవానికి ఏప్రిల్‌లోనే ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. కాని జైట్లీ డయోబెటిస్ సమస్యతో పాటు మరికొన్ని ఇబ్బందులు రావడంతో నిర్ణయం మార్చుకొన్నారు. ఆయన శనివారం ఎయిమ్స్‌లో చేరగా... ఉదయం 8 గంటలకు ఆపరేషన్ మొదలు పెట్టారు. ఏప్రిల్ 6న జైట్లీ ఓ ట్వీట్ చేశారు. అందులో తాను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు... త్వరలోనే ట్రీట్మెంట్ తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.