యాప్నగరం

మోదీ ఎఫెక్ట్: ఒక్క రోజులో ఊళ్లోవాళ్లంతా కోటీశ్వరులయ్యారు!

మోదీ సర్కారు పుణ్యమా అని అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ గ్రామం ఆసియాలోనే సంపన్న గ్రామాల్లో ఒకటిగా అవతరించింది.

TNN 8 Feb 2018, 5:02 pm
అరుణాచల్ ప్రదేశ్‌లోని బోమ్జా అనే గ్రామం ఆసియాలోకెల్లా ధనిక గ్రామాల్లో ఒకటిగా నిలిచింది. మోదీ పుణ్యమా అని ఒక్క రోజులోనే గ్రామస్థులంతా కోటీశ్వరులయ్యారు. అదేలా సాధ్యం అనుకుంటున్నారా..? రక్షణ శాఖ అవసరాల నిమిత్తం ఆ గ్రామానికి చెందిన 200 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఈ భూమి కోసం గానూ రూ.40 కోట్లా 80 లక్షలను రైతులకు చెల్లించింది. ఆ గ్రామంలోని 31 కుటుంబాలకు పరిహారం అందింది. దీంతో వారంతా కోటీశ్వరులయ్యారు.
Samayam Telugu arunachal village bomja among asias richest thanks to land acquisition payment by modi government
మోదీ ఎఫెక్ట్: ఒక్క రోజులో ఊళ్లోవాళ్లంతా కోటీశ్వరులయ్యారు!


భూమిని ఇచ్చినందుకు ఒక కుటుంబానికి రూ.2.44 కోట్ల పరిహారం దక్కగా, మరో కుటుంబానికి ఏకంగా రూ.6.73 కోట్లు లభించింది. 29 కుటుంబాలకు రూ.1.09 కోట్ల చొప్పున భూసేకరణ కోసం పరిహారం చెల్లించారు. దీంతో భూమ్జాలోని కుటుంబాలన్నీ ఒక్కసారిగా సంపన్న కుటుంబాలుగా మారిపోయాయి.

చైనా సరిహద్దుకు సమీపంలో ఉండే ఈ గ్రామం.. సైనిక అవసరాల పుణ్యమా అని ఊహించని రీతిలో సంపన్న గ్రామంగా మారింది. రైతుల దగ్గర నుంచి సేకరించిన భూమిలో కీ లొకేషన్ ప్లాన్ యూనిట్లను ఆర్మీ ఏర్పాటు చేయనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.