యాప్నగరం

కేజ్రీవాల్ మళ్లీ సారీ చెప్పారు...

ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ సారీల పరంపర కొనసాగిస్తున్నారు. ఈ మధ్యే కేంద్రమంత్రి గడ్కరీకి సారీ చెప్పిన కేజ్రీ... తాజాగా ఆర్థికమంత్రి జైట్లీని క్షమాపణలు కోరారు.

Samayam Telugu 2 Apr 2018, 4:00 pm
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ సారీల పరంపర కొనసాగిస్తున్నారు. ఈ మధ్యే కేంద్రమంత్రి గడ్కరీకి సారీ చెప్పిన కేజ్రీ... తాజాగా ఆర్థికమంత్రి జైట్లీని క్షమాపణలు కోరారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జైట్లీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. దీనిపై క్షమాపణ అడుగుతూ కేజ్రీవాల్‌తో పాటూ మరో ముగ్గురు ఆప్ నేతలు ఓ లేఖ రాశారు. తమ ఆరోపణల వల్ల జైట్లీ కాని... కుటుంబ సభ్యులు కాని బాధపడినా... మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరుతున్నామన్నారు.
Samayam Telugu Kejri


2015లో కేజ్రీవాల్, ఆప్ నేతలు తనపై చేసిన ఆరోపణల్ని సవాల్ చేస్తూ జైట్లీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు ఆయన సారీ చెప్పడంతో... దీనిని వెనక్కు తీసుకునే అవకాశాల కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ జైట్లీ, గడ్కరీ కంటే ముందు కాంగ్రెస్ నేత సిబల్‌తో పాటూ మరికొంంతమందికి ఈలాగే సారీ చెప్పారు. వరుసగా కేజ్రీ క్షమాపణలు చెప్పడంపై సొంత పార్టీలోనే విమర్శలు కూడా మొదలయ్యాయి.
Read This Story Also In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.