యాప్నగరం

మోడీ డిగ్రీని ప్రజలముందుంచండి

ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్టును ప్రజల ముందుంచాలని ఢిల్లీ సీఎం కోరారు.

TNN 5 May 2016, 5:25 pm
ప్రధాని నరేంద్రమోడీ విద్యార్హతల వ్యవహారం మరింత ముదిరింది. ఆయన చదివి ఉత్తీర్ణత సాధించారని చెపుతున్న బీఎ డిగ్రీని ప్రజలముందు ఉంచాలని ఢిల్లీ యూనివర్సిటీని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ యోగేష్ త్యాగీకి ఇటీవల లేఖ కూడా రాసారు. ''ఆయన (నరేంద్రమోడీ) ఢిల్లీ యూనివర్సిటీ నుండి బీఏ కోర్సు చేయలేదని, ఇందుకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేవని కొందరు చెపుతున్నారు. మోడీ అడ్మిషన్ ఫారం, మార్కుల పత్రాల్లాంటి రికార్డులు యూనివర్సిటీ వద్ద లేవు' అని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నారు.
Samayam Telugu arvind kejriwal to delhi university make pm modis ba degree public
మోడీ డిగ్రీని ప్రజలముందుంచండి


మోడీ గుజరాత్ యూనివర్సిటీ నుండి ఎంఎ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని ఆ యూనివర్సిటీ చెబుతోందని, అసలు డిగ్రీ లేకుండా ఎంఏ ఎలా చేస్తారని ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రశ్నలు లేవదీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.