యాప్నగరం

76 మంది జవాన్లు చికిత్స పొందుతున్నారు: ఇండియన్ ఆర్మీ

Galwan Valley Clash: గల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో 76 మంది సైనికులు గాయపడ్డట్లు ఇండియన్ ఆర్మీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఘర్షణలో 20 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.

Samayam Telugu 19 Jun 2020, 12:46 am
ల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో అమరులైన, గాయపడిన సైనికుల సంఖ్యపై పలు అనుమానాలు రేకెత్తుతున్న వేళ ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ఈ ఘర్షణలో 20 మంది జవాన్లు వీర మరణం పొందగా.. మరో 76 మంది గాయపడినట్లు ఇండియన్ వర్గాలు వెల్లడించిన వివరాల ద్వారా తెలుస్తోంది. వీరిలో 18 మంది సైనికులు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఇండియన్ ఆర్మీ వర్గాల ద్వారా ఈ వివరాలు తెలిసినట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ గురువారం (జూన్ 18) రాత్రి ట్వీట్ చేసింది.
Samayam Telugu అమర సైనికుడి భౌతికకాయాన్ని తరలిస్తున్న దృశ్యం
Ladakh Face Off


ఏఎన్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. లేహ్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో 18 మంది సైనికులు చికిత్స పొందుతున్నారు. ఘర్షణలో వీరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. వీరిలో ఎవరికీ ప్రమాదమేమీ లేదు. 15 రోజుల్లో ఈ జవాన్లందరూ విధుల్లో చేరతారు. మరో 58 మంది సైనికులు ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరు వారం రోజుల్లో విధుల్లో చేరతారు.

ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 58 మంది సైనికులు స్వల్పంగా గాయపడినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. వారం రోజుల్లో వారంతా పూర్తిగా కోలుకుంటారని వెల్లడించాయి.

చైనా బలగాలు పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. తమ ప్రణాళికలో భాగంగా గల్వాన్ లోయలో సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా భారత సైన్యం చేసిన హెచ్చరికలను బేఖాతరు చేశాయి. దీంతో కల్నల్ సంతోశ్ నేతృత్వంలోని సైనిక బృందం ఆ శిబిరాన్ని తొలగించడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో చైనా బలగాలు కర్కశంగా దాడి చేశాయి.

చైనా సైనికులు దాడి కోసం పదునైన ఆయుధాలు, ముళ్లకంచెలను ఉపయోగించారు. పదునైన మొలలతో సిద్ధం చేసిన రాడ్లతో భారత జవాన్లపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది దాడిలో ఉపయోగించినట్లుగా చెబుతున్న మారణాయుధాలను రక్షణ రంగ నిపుణులు అజయ్ శుక్లా ట్వీట్ చేశారు.

Galwan Valley Clash


చైనా బలగాలు దొంగ దెబ్బ తీసినా.. భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. భారత జవాన్ల ఎదురుదాడిలో కనీసం 35 మంది చైనా సైనికులు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ స్థాయి నష్టాన్ని డ్రాగన్ ఊహించలేదు. బీజింగ్ దీన్ని తీవ్ర అవమానంగా భావిస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం పేర్కొంది. జవాన్ల మరణాలపై చైనా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇరు దేశాల సైనికులు ఆయుధాలను కలిగి ఉన్నప్పటికీ గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఘర్షణలో వాటిని ఉపయోగించలేదు.

Also Read: చైనా అదుపులో మన జవాన్లు ఉన్నారా.. క్లారిటీ ఇచ్చిన ఆర్మీ
Must Read: నేను బతికే ఉన్నా.. జవాన్ నుంచి భార్యకు ఫోన్, ఊర్లో సంబరాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.