యాప్నగరం

ఢిల్లీని వణికిస్తున్న యమున నది.. 1500 మంది తరలింపు!

ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పలు తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.

Samayam Telugu 29 Jul 2018, 1:02 pm
ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పలు తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హర్యాణా 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల ఢిల్లీలో ఈ పరిస్థితి ఏర్పడింది.
Samayam Telugu photo


ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కెజ్రీవాల్ అప్రమత్తత ప్రకటించారు. ఆయన ఆదేశాలు మేరకు తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పునరావాస కేంద్రాలు, పాఠశాలలకు తరలిస్తున్నారు. తూర్పు ఢిల్లీలోని 10 ప్రాంతాల్లో నిరాశ్రయుల కోసం ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేశారు.

ఉత్తరాది అతలాకుతలం: భారీ వర్షాల వల్ల ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పటి వరకు 58 మంది మరణించారు. రానున్న రెండు రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యాణా, చండీగడ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మీదుగా ప్రవహించే యమునా, గంగా నదులు మరింత ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.